NTV Telugu Site icon

Waqf Board : మా ఆస్తులను వక్ఫ్ బోర్డు లాగేసుకుంది.. జేపీసీకి 600 క్రైస్తవ కుటుంబాలు ఫిర్యాదు..!

Waq

Waq

Waqf Board : వక్ఫ్ సవరణ బిల్లు-2024పై కేరళలోని కొచ్చి నగర శివార్లలోని చేరై గ్రామానికి చెందిన దాదాపు 610 మంది క్రైస్తవ కుటుంబాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ఫిర్యాదు చేశారు. తమ ఆస్తులను కూడా వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంటోందని ఆ కుటుంబాలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రైస్తవ కుటుంబాల వాణిని వినిపిస్తూ కేరళలోని సైరో మలబార్ చర్చ్, కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్‌లు పూర్తి వివరాలతో కూడిన లేఖను జేపీసీకి పంపాయి. వాటిని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.

Read Also: Israel- Iran: ఇజ్రాయెల్పై అణు దాడి చేయాలని ఇరాన్ ప్రజలు డిమాండ్..

కాగా, వక్ఫ్ భూముల అంశం దేశంలోని అన్ని వర్గాల ప్రజలనూ చాలా ప్రభావితం చేస్తోంది అనేందుకు ఈ లేఖలే నిదర్శనమని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ అంశంపై క్రైస్తవ వర్గం తీవ్ర అభ్యంతరాలను కూడా జేపీసీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా మునాంబం గ్రామం పరిధిలోని క్రైస్తవుల ఆస్తులనూ వక్ఫ్ బోర్డు స్వాధీనం చేస్తోందని జేపీసీకి క్రైస్తవ మత పెద్దలు పంపిన ఓ లేఖలో తెలిపారు. చేరై, మునాంబం గ్రామాల్లో అత్యధిక సంఖ్యల్లో క్రైస్తవులు, మత్స్యకారులేనని, వాళ్లు దశాబ్దాలుగా ఆయా గ్రామాల్లోనే నివసిస్తున్నారని వెల్లడించారు.