Karnataka: మతాంతర జంటపై దాడి..హోటల్ రూంలోకి ప్రవేశించి చితకబాదిన వైనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో మతాంతర జంటలపై దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల బెళగావిలో ఇటీవల ఇలాగే ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతితో కలిసి ఉండగా.. మైనారిటీ వర్గానికి చెందిన 10 మందికి పైగా వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఎందుకు అమ్మాయితో కలిసి ఉన్నావంటూ ఓ గదికి తీసుకెళ్లి చితకబాదారు. ఈ ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
Read Also: Indigo Ayodhya Flight: అయోధ్యకు కొత్త విమాన సర్వీసును ప్రారంభించిన ఇండిగో.. ఛార్జీ ఎంతంటే ?
Also Read
ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనే మరోసారి ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది. హవేరి జిల్లాలో ఒక హోటల్ గదిలో బస చేస్తున్న మతాంతర జంటను ఆరు నుంచి ఏడుగురు వ్యక్తుల బృందం తిడుతూ.. దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జనవరి 7న జరగగా.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మతాంతర జంట హోటల్ గదిని బుక్ చేసుకున్నారని సమాచారం అందుకున్న ఈ గుంపు హోటల్ లోకి చొరబడి, జంట నివసిస్తున్న గదిలోకి ప్రవేశించి దాడి చేశారు. అసభ్యపదజాలంతో తిడుతూ వారిపై దాడికి తెగబడ్డారు. వారిపై దాడి చేసిన వారు స్థానికులే అని, వారికి ఏ సంస్థతో సంబంధం లేదని హవేరి ఎస్పీ అన్షు కుమార్ చెప్పారు.
తాజావార్తలు
-
2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
-
CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..
-
Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!