Road accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న సమయంలో భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తిరుచ్చి-చెన్నై హైవేపై వ్యాన్ డ్రైవర్ అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తిరువణ్ణామలైకి చెందిన ఈ బృందం తిరుచెందూర్లోని మురుగన్ ఆలయాన్ని, మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని దర్శించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
Read Also: Satyam Sundaram: వాళ్లిద్దరూ లేకుంటే ‘సత్యం సుందరం’ లేదు: డైరెక్టర్ సి. ప్రేమ్ కుమార్ ఇంటర్వ్యూ
సెరతానూర్ సమీపంలో తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ప్రమాదం సభవించింది. వ్యాన్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో, అది రహదారిపై నుండి వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టాడు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమీపంలోని ప్రయానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో రెస్క్యూ టీం అక్కడికి చేరింది. యంత్రాల సాయంతో వాహనంలో చిక్కుకున్న 13 మంది భక్తులను రక్షించారు. క్షతగాత్రులను ముండియంబాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.