Congress: ‘‘ వరసగా 6 ఎన్నికల్ని ఓడిపోయాం’’.. రాహుల్ గాంధీ, ఖర్గేలపై సోనియా గాంధీకి లేఖ..
- వరసగా 6 ఎన్నికల్ని ఓడిపోయాం, మేల్కొనండి..
- సోనియాగాంధీకి ఒడిశా కాంగ్రెస్ నేత లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ పార్టీ వరస వైఫల్యాలపై ఆవేదన చెందిన ఒడిశాకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సోనియా గాంధీకి సంచలన లేఖ రాశారు. కాంగ్రెస్కు చాలా సంస్కరణలు అవసమని ఆయన చెప్పారు. బారాబతి-కటక్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మొక్విమ్ డిసెంబర్ 8న సోనియా గాంధీకి ఐదు పేజీల లేఖ పంపారు. లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటములు, 2024 నుంచి బీహార్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఒడిశా పరాజయాలను ఆయన ప్రస్తావించారు.
Read Also: Tej Pratap Yadav: పశ్చిమ బెంగాల్, యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనశక్తి జనతాదళ్..
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
రాహుల్ గాంధీని కలిసేందుకు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా, అనుమతి లభించడం లేదని చెప్పారు. ఇది తన వ్యక్తిగత ఫిర్యాదు కాదని, భారతదేశం అంతటా కార్యకర్తలు ఇలాగే భావిస్తున్నారని అన్నారు. పార్టీకి యువత, కార్యకర్తలతో పెరుగుతున్న అంతరాయాన్ని మొక్విమ్ హైలెట్ చేశారు. శశిథరూర్, డీకే శివకుమార్, సచిన్ పైటల్, ప్రియాంకాగాంధీ వంటి నేతలు భవిష్యత్తులో పార్టీకి ప్రధాన నాయకత్వంగా నిలవాలని సూచించారు. మల్లికార్జుణ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత ఆయన యువతతో కలవలేకపోతున్నారని అన్నారు. మనం ఇప్పుడు మేల్కొనకపోతే, మనం వారసత్వంగా పొందిన కాంగ్రెస్ పార్టీని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
జ్యోతిరాధిత్య సింధియా, హిమంత బిశ్వ సర్మ వంటి యువ నేతల్ని కాంగ్రెస్ కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. సింధియా పార్టీ మార్పు మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని కూల్చివేసిందని, హిమంత ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పట్టును పెంచి, కాంగ్రెస్ను దాదాపుగా తుడిచివేశాడని చెప్పారు. శతాబ్ధాల నాటి వారసత్వం చేజారిపోతోందని, ఇతరుల చేతిలో ఓటమి కన్నా, సొంతింటి నిర్ణయాల వల్లే ఇలా జరుగుతోందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!