5G Auction: స్పెక్ట్రమ్ కోసం రూ.1.49 లక్షల కోట్లకు పైగా బిడ్లు.. రేపు కూడా కొనసాగనున్న వేలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5G Auction: 5జీ స్పెక్ట్రమ్ వేలంలో గురువారం మూడో రోజు ముగిసే సమయానికి ప్రభుత్వానికి 1,49,623 కోట్ల రూపాయల విలువైన బిడ్లు వచ్చాయి. కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేలం మూడో రోజు ముగిసే వరకు 16 రౌండ్ల బిడ్డింగ్లు పూర్తయ్యాయి. శుక్రవారం నాలుగో రోజు వేలం కొనసాగనుంది. మంగళవారం వేలం ప్రారంభం రోజున రూ.1.45 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. తొలిరోజు నాలుగు రౌండ్ల స్పెక్ట్రమ్ బిడ్డింగ్ జరిగింది. బుధవారం ఐదు రౌండ్లు జరిగిన వేలం మొత్తం తొమ్మిదికి చేరుకుంది. మూడో రోజైన గురువారం ఏడు రౌండ్లు నిర్వహించగా ఆ సంఖ్య 16కి చేరింది. నాలుగో రోజు వేలం 17వ రౌండ్తో ప్రారంభమవుతుంది.
తొలి రోజు ముగిసే సమయానికి బిడ్ విలువ రూ.1.45 లక్షల కోట్లుగా ఉంది. రెండో రోజు రూ.1,49,454 కోట్లకు, మూడో రోజు ముగిసే సమయానికి రూ.1,49,623 కోట్లకు చేరుకుంది. 5జీ వేలం కోసం నాలుగు సంస్థలు పోటీలో ఉన్నాయి. ఈ సంస్థలు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్, అదానీ డేటా నెట్వర్క్స్ లిమిటెడ్. బిడ్లలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో అత్యంత దూకుడుగా ఉంది, సునీల్ భారతీ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్టెల్ తర్వాతి స్థానంలో ఉంది. నాలుగు కంపెనీలు కలిపి రూ.21,800 కోట్లను ఈఎండీగా డిపాజిట్ చేశాయి. ఈ మొత్తంలో సగానికిపైగా భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు చెందినది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 14,000 కోట్లను ఈఎండీగా ఉంచగా.. భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ రూ. 5,500 కోట్లుగా ఉంది. వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ 5జీ వేలం కోసం ఈఎండీగా రూ. 2,200 కోట్లు డిపాజిట్ చేసింది, అదానీ డేటా నెట్వర్క్ల ఈఎండీ మొత్తం రూ. 100 కోట్లు. ఈఎండీ మొత్తాలు వేలంలో స్పెక్ట్రమ్ను తీయడానికి కంపెనీ యొక్క ప్రణాళిక యొక్క విస్తృత సూచనను అందిస్తాయి. ఈఎండీ అర్హత పాయింట్లను నిర్ణయిస్తుంది, దీని ద్వారా టెల్కోలు ఇచ్చిన సర్కిల్లో నిర్దిష్ట స్పెక్ట్రమ్ను లక్ష్యంగా చేసుకుంటాయి.
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
Spent on Ads: ప్రకటనల కోసం రూ.3,339 కోట్లు.. పార్లమెంట్లో కేంద్రం వెల్లడి
ఏ కంపెనీ ఎంత మేర స్పెక్ట్రమ్ దక్కించకుంటున్నందన్న విషయం వేలం పూర్తయ్యాకే తెలుస్తుంది. అయితే, రూ.80,100 కోట్లతో ఎక్కువ స్పెక్ట్రమ్ను జియో దక్కించుకునే అవకాశం ఉందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. రూ.45 వేల కోట్లతో ఎయిర్టెల్ 1800 MHz, 2100 MHz బ్యాండ్లో స్పెక్ట్రమ్ను సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. వొడాఫోన్ ఐడియా రూ.18,400 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ను, అదానీ డేటా నెట్వర్క్స్ రూ.900 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ను సొంతం చేసుకుంటుందని పేర్కొంది. రూ 4.3 లక్షల కోట్ల విలువైన 72 GHz స్పెక్ట్రమ్ను కేంద్రం ఈ సారి వేలానికి ఉంచిన సంగతి తెలిసిందే. వేలం పూర్తయ్యాక స్పెక్ట్రమ్ను ఆగస్టు 14 కల్లా కేటాయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా.. సెప్టెంబరు కల్లా దేశంలో 5జీ సేవలు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. పూర్తి నిడివి గల అత్యంత నాణ్యమైన వీడియో లేదా సినిమాను సెకన్లలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇ-హెల్త్, కనెక్టెడ్ వెహికల్స్, మెరుగైన ఆగ్మెంటెడ్ రియాల్టీ, మెటావర్స్ అనుభవాలు, అధునాతన మొబైల్ క్లౌడ్ గేమింగ్ వంటివి అందుబాటులోకి వస్తాయి.
తాజావార్తలు
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
-
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్కు బీసీసీఐ అల్టిమేటం!
-
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్తో మన జీవితాలే మారిపోవచ్చు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!