5G Auction: స్పెక్ట్రమ్ కోసం రూ.1.49 లక్షల కోట్లకు పైగా బిడ్లు.. రేపు కూడా కొనసాగనున్న వేలం
5G Auction: 5జీ స్పెక్ట్రమ్ వేలంలో గురువారం మూడో రోజు ముగిసే సమయానికి ప్రభుత్వానికి 1,49,623 కోట్ల రూపాయల విలువైన బిడ్లు వచ్చాయి. కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేలం మూడో రోజు ముగిసే వరకు 16 రౌండ్ల బిడ్డింగ్లు పూర్తయ్యాయి. శుక్రవారం నాలుగో రోజు వేలం కొనసాగనుంది. మంగళవారం వేలం ప్రారంభం రోజున రూ.1.45 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. తొలిరోజు నాలుగు రౌండ్ల స్పెక్ట్రమ్ బిడ్డింగ్ జరిగింది. బుధవారం ఐదు రౌండ్లు జరిగిన వేలం మొత్తం తొమ్మిదికి చేరుకుంది. మూడో రోజైన గురువారం ఏడు రౌండ్లు నిర్వహించగా ఆ సంఖ్య 16కి చేరింది. నాలుగో రోజు వేలం 17వ రౌండ్తో ప్రారంభమవుతుంది.
తొలి రోజు ముగిసే సమయానికి బిడ్ విలువ రూ.1.45 లక్షల కోట్లుగా ఉంది. రెండో రోజు రూ.1,49,454 కోట్లకు, మూడో రోజు ముగిసే సమయానికి రూ.1,49,623 కోట్లకు చేరుకుంది. 5జీ వేలం కోసం నాలుగు సంస్థలు పోటీలో ఉన్నాయి. ఈ సంస్థలు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్, అదానీ డేటా నెట్వర్క్స్ లిమిటెడ్. బిడ్లలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో అత్యంత దూకుడుగా ఉంది, సునీల్ భారతీ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్టెల్ తర్వాతి స్థానంలో ఉంది. నాలుగు కంపెనీలు కలిపి రూ.21,800 కోట్లను ఈఎండీగా డిపాజిట్ చేశాయి. ఈ మొత్తంలో సగానికిపైగా భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు చెందినది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 14,000 కోట్లను ఈఎండీగా ఉంచగా.. భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ రూ. 5,500 కోట్లుగా ఉంది. వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ 5జీ వేలం కోసం ఈఎండీగా రూ. 2,200 కోట్లు డిపాజిట్ చేసింది, అదానీ డేటా నెట్వర్క్ల ఈఎండీ మొత్తం రూ. 100 కోట్లు. ఈఎండీ మొత్తాలు వేలంలో స్పెక్ట్రమ్ను తీయడానికి కంపెనీ యొక్క ప్రణాళిక యొక్క విస్తృత సూచనను అందిస్తాయి. ఈఎండీ అర్హత పాయింట్లను నిర్ణయిస్తుంది, దీని ద్వారా టెల్కోలు ఇచ్చిన సర్కిల్లో నిర్దిష్ట స్పెక్ట్రమ్ను లక్ష్యంగా చేసుకుంటాయి.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Spent on Ads: ప్రకటనల కోసం రూ.3,339 కోట్లు.. పార్లమెంట్లో కేంద్రం వెల్లడి
ఏ కంపెనీ ఎంత మేర స్పెక్ట్రమ్ దక్కించకుంటున్నందన్న విషయం వేలం పూర్తయ్యాకే తెలుస్తుంది. అయితే, రూ.80,100 కోట్లతో ఎక్కువ స్పెక్ట్రమ్ను జియో దక్కించుకునే అవకాశం ఉందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. రూ.45 వేల కోట్లతో ఎయిర్టెల్ 1800 MHz, 2100 MHz బ్యాండ్లో స్పెక్ట్రమ్ను సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. వొడాఫోన్ ఐడియా రూ.18,400 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ను, అదానీ డేటా నెట్వర్క్స్ రూ.900 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ను సొంతం చేసుకుంటుందని పేర్కొంది. రూ 4.3 లక్షల కోట్ల విలువైన 72 GHz స్పెక్ట్రమ్ను కేంద్రం ఈ సారి వేలానికి ఉంచిన సంగతి తెలిసిందే. వేలం పూర్తయ్యాక స్పెక్ట్రమ్ను ఆగస్టు 14 కల్లా కేటాయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా.. సెప్టెంబరు కల్లా దేశంలో 5జీ సేవలు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. పూర్తి నిడివి గల అత్యంత నాణ్యమైన వీడియో లేదా సినిమాను సెకన్లలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇ-హెల్త్, కనెక్టెడ్ వెహికల్స్, మెరుగైన ఆగ్మెంటెడ్ రియాల్టీ, మెటావర్స్ అనుభవాలు, అధునాతన మొబైల్ క్లౌడ్ గేమింగ్ వంటివి అందుబాటులోకి వస్తాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!