Subramaniaswamy deepam row: మద్రాస్ హైకోర్టు జడ్జికి మాజీల మద్దతు.. ఇండియా కూటమిపై విమర్శలు..
- దేశవ్యాప్త సంచలనంగా తిరుప్పరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయ వివాదం..
- తీర్పు చెప్పిన జడ్జిపై కాంగ్రెస్-డీఎంకే ‘‘అభిశంసన తీర్మానం’’..
- జడ్జికి మద్దతుగా ఇండియా కూటమిపై మాజీల విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Subramaniaswamy deepam row: తమిళనాడు తిరుప్పరంకుండ్రం సుబ్రమణ్యస్వామి దేవాలయ దీపం వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల, మద్రాస్ హైకోర్టు జడ్జి జీఆర్ స్వామినాథన్ సంచలన తీర్పు ఇచ్చారు. కొండపై ఉన్న ఆలయం వద్ద దీపం వెలిగించాలని ఆదేశించారు. డీఎంకే ప్రభుత్వ వాదనల్ని పట్టించుకోలేదు. 100 ఏళ్లకు పైగా సంప్రదాయంగా వస్తున్న కొండ దిగువన ఉన్న స్తంభానికి బదులుగా, కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించాలని ఆదేశించారు. కొండపైన ఉన్న స్తంభం కూడా ఆలయ ఆస్తి అని స్పష్టం చేశారు.
అయితే, ఇది ఇప్పుడు వివాదాస్పదమైంది. న్యాయమూర్తిని తొలగించాలంటూ ఇండియా కూటమికి చెందిన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే పార్టీలకు సంబంధించిన 100 మందికిపైగా ఎంపీలు మద్దతు తెలుపుతూ రెండు రోజుల క్రితం స్పీకర్ ఓంబిర్లాకు ‘‘అభిశంసన’’ తీర్మానాన్ని ఇచ్చారు. ఈ తీర్మానం ఇచ్చిన బృందంలో అఖిలేష్ యాదవ్, ప్రియాంకాగాంధీ, కనిమొళిలు ఉన్నారు. ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో ఈ తీర్పు మత ఉద్రిక్తతల్ని పెంచుతుందని డీఎంకే వాదిస్తోంది. మధురైకి సమీపంలో ఉన్న కొండపై 6వ శతాబ్ధానికి చెందిన సుబ్రమణ్య స్వామి ఆలయం ఉంది. అదే కొండపై 14వ శతాబ్ధానికి చెందిన ఒక దర్గా ఉంది. దీంతో వివాదం రాజుకుంది.
Also Read
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై జడ్జి జీఎస్ స్వామినాథన్కు మద్దతుగా మాజీ న్యాయమూర్తులు రంగంలోకి దిగారు. ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 56 మంది న్యాయమూర్తులు అభిశంసన తీర్మానాన్ని తప్పుపట్టారు. తమ రాజకీయ సిద్ధాంతాలకు రుచించని తీర్పు చెప్పిన న్యాయమూర్తిని భయపెట్టే పనిగా అభివర్ణించారు. ఇది న్యాయమూర్తులను భయపెట్టే ప్రయత్నమని అన్నారు. ఇలాంటి వైఖరి దేశ న్యాయ స్వతంత్రను తీవ్రంగా దెబ్బతీస్తుందని వారు తన ప్రకటనలో పేర్కొన్నారు. 1975 లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సంఘటనలను ఉదహరిస్తూ.. ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఒత్తిడికి గురి చేసే పాత పద్ధతి అని అన్నారు.
మరోవైపు, ఈ అభిశంసన ప్రయత్నాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. కేంద్ర హోం మంత్రి దీనిపై మాట్లాడుతూ.. ఇది ప్రతిపక్షాల బుజ్జగింపు రాజకీయాలు అని ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి ననుంచి ఒక న్యాయమూర్తి తీర్పు కోసం అభిశంసన ఎదుర్కోవడం ఎప్పుడూ జరగలేదు. వారు తమ ఓటు బ్యాంకును సంతృప్తి పరిచేందుకు దీనిని తీసుకువచ్చారని అన్నారు. మరోవైపు, తమిళనాడు ఎంపీ, డీఎంకే చీఫ్ స్టాలిన్ మాట్లాడుతూ.. బీజేపీ మతపరమైన అంశాలను రాజకీయం చేస్తోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
-
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
-
mAadhaar app: ఎమ్-ఆధార్ యాప్కు గుడ్బై.. నేటి నుంచి పాత యాప్ సేవలు నిలిపివేత.. కొత్త Aadhaar యాప్లో అదిరే ఫీచర్లు
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!