హర్యానా ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ను పరీక్ష రద్దు చేసింది. పేపర్ లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పరీక్ష రద్దయినందుకు అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, త్వరలో మళ్లీ కొత్తగా షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించింది. దాదాపు 10,300 మంది ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 22 జిల్లాల్లోని మొత్తం 35 సెంటర్లలో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. కాగా, పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలతో వాయిదా పడింది.