Union minister Nisith Pramanik: బీజేపీతో టచ్లో 40-45 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిస్థితులు మరోసారి కాకరేపుతున్నాయి.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి.. బీజేపీ వర్సెస్ టీఎంసీగా పరిస్థితి మారిపోయి.. విమర్శలు, ఆరోపణలు, దాడులు, రైడ్స్, అరెస్ట్లు.. ఇలా ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.. మరోసారి దీదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం ఎక్కడా తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. తాజాగా, కేంద్ర మంత్రి, బీజేపీ నేత నిశిత్ ప్రమానిక్ చేసిన వ్యాఖ్యలు సంచనలంగా మారాయి.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన 40-45 మంది ఎమ్మె ల్యేలు తమతో (బీజేపీ) టచ్లో ఉన్నారని వెల్లడించారు.. అంతేకాదు.. రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణాణాలు చోటు చేసుకోనున్నాయని చెప్పుకొచ్చారు..
Read Also: JP Nadda: దక్షిణాదిపై ఫోకస్.. మరోసారి తెలంగాణకు జేపీ నడ్డా..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
ఇక, నిశిత్ ప్రమానిక్ కంటే ముందు మాట్లాడిన బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారికారి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.. అంతేకాదు.. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలోనే అరెస్ట్ కాబోతోంది అంటూ సంచలన కామెంట్లు చేశారు. మరోవైపు, 40 మంది టీఎంసీ ఎమ్మె ల్యేలు తమతో సంబంధాలు కలిగిఉన్నారని చెప్పుకొచ్చారు.. కూచ్ బెహర్లో నిర్వహించిన ఓ సభలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమానిక్… తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యొక్క పునాదులు “చాలా బలహీనంగా” మారాయని.. 40-45 ఎమ్మెల్యేలు మాతో సన్నిహితంగా ఉన్నారని వెల్లడించడం చర్చగా మారింది.. టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు.. భవిష్యత్తులో ఏం చేయాలనేది ఆలోచన చేస్తున్నామంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు.. బెంగాల్ రాజకీయాల్లో మరోసారి కాకరేపుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ ప్రభుత్వం తన ఐదేళ్ల కాలపరిమితిని పూర్తి చేయలేదని, 2024 నాటికి బహిష్కరించబడుతుందని అంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచుతున్నాయి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?