Niaph Virus: 6కి చేరిన నిపా కేసులు.. కేరళలో హైఅలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niaph Virus: కేరళలో నిపా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరొకరికి వైరస్ సోకినట్లు తెలిసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6కి చేరింది. ఇప్పటికే ఇందులో ఇద్దరు మరణించారు. తాజాగా 39 ఏళ్ల వ్యక్తికి నిపా పాజిటివ్ గా తేలింది. 2018 నుంచి చూస్తే కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ నాలుగో సారి విజృంభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న నిఫా ‘‘బంగ్లాదేశ్ వేరియంట్’’అని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. అయితే ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ, మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.
ప్రస్తుతం నమోదవుతున్న నిపా కేసులన్నీ కోజికోడ్ జిల్లాలోనే నమోదయ్యాయి. బుధవారం ఓ హెల్త్ వర్కర్ కి నిపా పాజిటివ్ అని తేలింది. అతని కాంటాక్ట్ లిస్టులో 706 మంది ఉండటం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఇందులో 77 మంది హైరిస్క్ కేటగిరిలో ఉన్నారు. 153 మంది ఆరోగ్య కార్యకర్తలు ఇతని కాంటక్ట్ లిస్టులో ఉన్నారు. కాగా, హై రిస్కులో ఉన్నవారికి ఎవరికీ లక్షణాలు కనిపించడం లేదని వీణా జార్జ్ బుధవారం తెలిపారు. ప్రస్తుతం 13 మంది ఆస్పత్రుల్లో పరిశీలనలో ఉన్నారు. వారికి తలనొప్పి వంటి తేలిక లక్షణాలు కనిపిస్తున్నాయిన ఆమె వెల్లడించారు.
Also Read
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
Read Also: Jammu Kashmir Encounter: 48 గంటలుగా కొనసాగుతున్న ఉగ్రవేట..
ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స లేదు. అయితే ఇప్పుడున్న వాటిలో ‘మోనో క్లోనల్ యాంటీబాడీ’ చికిత్స మాత్రమే సమర్థవంతంగా ఉంది. ఇప్పుడు ఇవి కేరళకి చేరుకున్నాయి. జ్వరం, శ్వాసకోశ సమస్య, తలనొప్పి, వాంతుల వంటి లక్షణాలు ఉంటాయి. వ్యాధి ముదిరితే మెదడు వాపు, మూర్చ, చివరకు కోమాలోకి వెళ్లి మరణం సంభవిస్తుంది. 2018లో కేరళలో నిపా విజృంభించడంతో 21 మంది చనిపోయారు. ఆ తరువాత 2019, 2021లో కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందింది.
గబ్బిలాలు, పందుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది, కాబట్టి అటవీ ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. తాజాగా సోకిన నిపా కేసులు అటవీ ప్రాంతం నుంచి 5 కిలోమీటర్లలోనే ఉద్భవించాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు కోజికోడ్ జిల్లాలో అతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర, వీల్యపల్లి, పురమేరి పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. స్కూళ్లకు సెలవులను ప్రకటించి, ప్రజల కార్యకలాపాలను తగ్గించారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!