Jammu Kashmir Encounter: 48 గంటలుగా కొనసాగుతున్న ఉగ్రవేట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలో ఎన్కౌంటర్ 48 గంటలుగా కొనసాగుతోంది. కోకెర్నాగ్ ప్రాంతంలో బుధవారం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే ముగ్గురు అధికారులు మరణించారు. కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోన్చక్తో పాటు జమ్మూ పోలీస్ డీఎస్పీ హిమాయున్ భట్ వీర మరణం పొందారు. అందరూ హై ర్యాంకింగ్ అధికారులు కావడంతో ఇటు ఆర్మీ, అటు పోలీస్ డిపార్ట్మెంట్కి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఇదిలా ఉంటే మరో జవాన్ మిస్ అవ్వడంతో పాటు ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది.
Read Also: US Politics: తండ్రి దేశ అధ్యక్షుడు.. తనయుడు హంతకుడు!
Also Read
రెండు రోజులుగా పీఓకే-జమ్మూకాశ్మీర్ మధ్య ఉన్న పర్వతాల్లో, దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. దట్టమైన అడవులు ఉగ్రవాాదులకు రక్షణ ఇస్తున్నాయి. అయితే ఎలాగైనా వీరిని మట్టుపెట్టాలనే ఉద్దేశంతో భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఉగ్రవాదుల మరణించిన ఆచూకీ లభించలేదు. భద్రతా బలగాలు కౌంటర్ టెర్రరిజం కోసం కొత్త తరహా ఆయుధాలు, స్ట్రైక్ సామర్థ్యం ఉన్న హెరాన్ డ్రోన్లను వాడుతున్నారు.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా ప్రాక్సీ సంస్థ అయిన ‘ ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు ముగ్గురు టెర్రరిస్టులు అటవీ ప్రాంతంలో నక్కి ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్ కి నాయకత్వం వహించిన కల్నల్ మన్ ప్రీత్ సింగ్, ఎన్ కౌంటర్ మొదలైన కొద్ది సేపటికే మరణించారు. మేజర్ ఆశిష్ ధోన్చక్, డీఎస్పీ హిమాయున్ భట్ తీవ్రగాయాలతో మరణించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!