Elephants Attack: జార్ఖండ్లో దారుణం.. కుటుంబాన్ని తొక్కిచంపిన ఏనుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephants Attack: జార్ఖండ్ రాష్ట్రంలో ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. లతేహార్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని తొక్కి చంపేశాయి. చనిపోయిన బాధితుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉండటం విషాదాన్ని నింపింది. శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో మల్హాన్ పంచాయతీ వద్ద ఇటుక బట్టీ యూనిట్ సమీపంలోని తాత్కాలిక గుడిసెలో 30 ఏళ్ల కూలీ ఫను భుయిన్యాన్ తన 26 ఏళ్ల భార్య బబితా దేవి, మూడేళ్ల కుమార్తెతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Read Also: Assam : బాలిక పై అత్యాచారం చేశాడు.. చంపి సెప్టిక్ ట్యాంక్ లో పడేశాడు
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ఘటన జరిగిన ప్రాంతం రాజధాని రాంచీ నుంచి 80 కిలోమీటర్లు ఉంది. ఇటుకబట్టీ ప్రాంతంలో ఏనుగుల గుంపు కనిపించిందని, ఒకే కుటుంబంలోని ముగ్గురిని చంపేశాయని, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఇతర కార్మికులు తప్పించుకోగలిగారని చంద్వా పోలీస్ స్టేషన్ అధికారి అమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం లతేహార్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
లాతేహార్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి రౌషన్ కుమార్ మాట్లాడుతూ.. బాలుమత్, చందవా అటవీ రేంజ్ మధ్యలో గత కొన్ని రోజులుగా సుమారు 14 ఏనుగులు సంచరిస్తున్నాయని, గురువారం సాయంత్రం చక్లా ప్రాంతంలో ఈ గుంపు కనిపించిందని, మేము ప్రజలను అప్రమత్తం చేశామని వెల్లడించారు. శుక్రవారం ఉదయం జరిగిన ఘటన గురించి చెబుతూ.. కూలీలు నిద్రలో ఉండటంతో ఏనుగుల మంద రావడం గమనించలేకపోయారని ఆయన అన్నారు. మరణించిన కుటుంబం గర్వా జిల్లాకు చెందినది, కుటుంబ సభ్యులకు తక్షణ సాయం కింద రూ. 60,000లను అటవీ శాఖ అందించింది.
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!