Kerala: బ్యూరోక్రాట్ కుటుంబం అనుమానాస్పద మృతి! డైరీలో ఏం రాసుందంటే..!
- కేరళలో ఓ బ్యూరోక్రాట్ ఫ్యామిలీ అనుమానాస్పద మృతి
- విదేశాల్లో ఉన్న బంధువుకి సమాచారం ఇవ్వాలని డైరీలో రాత
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో ఓ బ్యూరోక్రాట్ ఫ్యామిలీ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఏమైందో… ఏమో తెలియదు గానీ… ఇద్దరు ఉరివేసుకుని ఉండగా.. వృద్ధురాలి మంచంపై శవమై కనిపించింది. మృతదేహాలు దుర్వాసన కొడుతున్నాయి. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డైరీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Train Derailment in Odisha: పట్టాలు తప్పిన రైలు.. ప్రమాదంలో దెబ్బతిన్న మూడు బోగీలు
Also Read
- US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!
- Land Missile: భారత అంబులపొదిలో మరో అస్త్రం.. భూతల దాడి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
- PM Modi: స్లోవేకియా అధ్యక్ష భవన్లో మోడీ ఎదుట యోగా చేసిన చిన్నారులు.. వీడియో వైరల్
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్పై కేంద్రం కీలక ప్రకటన
మనీష్ విజయ్.. కేరళలోని సెంట్రల్ ఎక్సైజ్ మరియు జీఎస్టీ అదనపు కమిషనర్గా పని చేస్తున్నారు. సోదరి షాలిని, తల్లి శంకుతల ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. మనీష్ విజయ్, షాలిని వేర్వేరు గదుల్లో ఉరివేసుకుని ఉండగా.. తల్లి శకుంతల మంచంపై చనిపోయి ఉంది. తెల్లటి గుడ్డ చుట్టి పూలతో చుట్టబడి ఉంది. అంటే తల్లి ముందే చనిపోయిందా? లేదంటే చంపబడిందా? అన్నది అనుమానం. అనంతరం మనీష్ విజయ్, షాలిని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మనీష్ విజయ్ నాలుగు రోజుల నుంచి డ్యూటీకి రాకపోవడంతో సహచరులు.. ఇంటికి వచ్చేటప్పటికి దుర్వాసన కొడుతోంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్ధలుకొట్టి చూడగా.. ముగ్గురు శవాలుగా కనిపించారు. ఈ విధంగా దుర్ఘటన వెలుగులోకి వచ్చింది.
కొచ్చి పోలీస్ కమిషనర్ పుట్టా విమలాదిత్య మాట్లాడుతూ.. చాలా రోజుల క్రితం చనిపోవడంతో మృతదేహాలు కుళ్లిపోయాయని.. ఫోరెన్సిక్ నివేదిక తర్వాతే.. ఎలా చనిపోయారో చెప్పగలమని అన్నారు. ఒక గదిలో డైరీని గుర్తించినట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్న రక్తసంబంధికి సమాచారం తెలియజేయాలని రాసి ఉంది. దీంతో సమాచారాన్ని విదేశాల్లో ఉన్న బంధువుకు కబురు అందించారు.
జార్ఖండ్కు చెందిన ఈ కుటుంబం కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని కక్కనాడ్ కస్టమ్స్ క్వార్టర్స్లో నివాసం ఉంటుంది. మనీష్ విజయ్.. గతంలో కోజికోడ్ విమానాశ్రయంలో కస్టమ్స్ ప్రివెంటివ్లో పనిచేశాడు. అనంతరం ఏడాదిన్నర క్రితం కొచ్చికి బదిలీ అయ్యాడు. తల్లి, సోదరి కొన్ని నెలల క్రితం నుంచి అతనితో కలిసి ఉంటున్నారు.
ఇక షాలిని జార్ఖండ్లో ఒక చట్టపరమైన కేసును ఎదుర్కొంటోంది. దీని కోసం మనీష్ సెలవు కూడా తీసుకున్నాడు. 2006 జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) పరీక్షలో షాలిని మొదటి స్థానంలో నిలిచింది. డిప్యూటీ కలెక్టర్గా కూడా నియమితులయ్యారు. అయితే ఆమె ర్యాంకుపై సవాల్ చేసిన తర్వాత సర్వీసు నుంచి తొలగించారు. 2024లో ఈ కేసుపై సీబీఐ విచారణ చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. ప్రాణాలు పోయాయి.
ఇక విదేశాల్లో ఉన్న రక్తసంబంధి వచ్చాకే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Odela 2: అదిరిపోయిన ‘ఓదెల 2’ టీజర్ అనౌన్స్ మెంట్ వీడియో
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
PEDDI Percentage Issue : పెద్ది పర్సెంటేజ్.. నాకు తెలియదన్న నిర్మాత.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఛాంబర్
-
Hero Bikes Offers: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా.? ఆ బైక్లపై భారీ డిస్కౌంట్.!
-
Nagarjuna Birthday Special : ఎవర్ గ్రీన్ క్లాసిక్ రొమాంటిక్ మూవీ రీరిలీజ్ తో కింగ్ బర్త్ డే ట్రీట్ రెడీ
-
Benjamin Netanyahu: అమెరికా ఒప్పందం చేసుకున్నా తగ్గేదేలే.. ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!