PM Modi: పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు..
- కాంగ్రెస్.. నేషనల్ కాన్ఫరెన్స్.. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలపై ప్రధాని మోడీ ఆగ్రహం..
- దశాబ్దాలుగా జమ్మూలో ఉన్న దుర్భరమైన స్థితికి ఈ మూడు కుటుంబాలు బాధ్యులు..
- కశ్మీర్ లోయలో ఉగ్రవాదం.. తీవ్రవాదానికి కాంగ్రెస్-పీడీపీ- ఎన్సీ పార్టీలే పునాది వేశాయి: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దశాబ్దం తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఈరోజు (శనివారం) దోడా జిల్లాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కుటుంబం అనే మూడు కుటుంబాలు దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా జమ్మూలో ఉన్న దుర్భరమైన స్థితికి ఈ మూడు కుటుంబాలు బాధ్యులు అన్నారు. వారు అవినీతికి పాల్పడ్డడంతో పాటు అవసరాల కోసం మిమ్మల్ని కష్ట పెట్టారు అని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు కుటుంబాలు కశ్మీర్ లోయలో ఉగ్రవాదం, తీవ్రవాదానికి పునాది వేశారు అని మండిపడ్డారు.
Read Also: Viagra: అలాంటి వారు వయాగ్రా తీసుకోకుంటేనే మంచిది..
Also Read
- NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
ఇక, జమ్మూ కశ్మీర్ లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. సుసంపన్నమైన ప్రాంతంగా తయారు చేస్తాం.. అది “మోదీ కి గ్యారెంటీ” అని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. కశ్మీర్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు మూడు రాజకుటుంబాలకు.. ఇక్కడి యువతకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఒక కుటుంబం కాంగ్రెస్కు చెందినది, ఒకటి నేషనల్ కాన్ఫరెన్స్కు చెందినది కాగా, మరో కుటుంబం పీడీపీకి చెందినది తెలిపారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్ర పాలిత ప్రాంతం యొక్క భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. అయితే, జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం అట్టడుగు స్థాయికి చేరుకుంటుంది అన్నారు. ఒకప్పుడు సాయంత్రం తర్వాత అప్రకటిత కర్ఫ్యూ ఉండేదని లాల్ చౌక్ను సందర్శించాలంటే తనకు భయంగా ఉందని అప్పటి కాంగ్రెస్ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యను ప్రధాని గుర్తు చేశారు. కానీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూ కశ్మీర్ లో ఇటీవలి సంవత్సరాలలో మారుతున్న పరిస్థితులను నరేంద్ర మోడీ ప్రస్తావించారు.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..