2025 National Rewind: ఈ ఏడాది జాతీయంగా చరిత్ర సృష్టించిన నారీమణులు వీరే!
- మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరానికి గుడ్బై
- ఈ ఏడాది చరిత్ర సృష్టించిన నారీ శక్తులు
- ప్రపంచ కప్ను ముద్దాడిన భారత మహిళా క్రికెటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరానికి గుడ్బై చెప్పనున్నారు. 2026 సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఏడాది జాతీయంగా అనేక సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా మహిళా మణులు చరిత్ర సృష్టించారు. వారి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కల్నల్ సోఫియా ఖురేషి
కల్నల్ సోఫియా ఖురేషి పేరు ఈ ఏడాది మార్మోగింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్పై భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్కు కల్నల్ సోఫియా ఖురేష్ నాయకత్వం వహించారు. అలా సోఫియా ఖురేషి వెలుగులోకి వచ్చారు. దేశమంతా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.
Also Read
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం

హర్మన్ ప్రీత్ కౌర్
హర్మన్ ప్రీత్ కౌర్.. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్. ఈ ఏడాది ఆమె ఆధ్వర్యంలో మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే మహిళల ప్రపంచ కప్ను ముద్దాడింది. జట్టును ముందుండి నడిపించి కప్ సాధించింది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది.

జెమిమా రోడ్రిగ్స్
ఇక హర్మన్ ప్రీత్ కౌర్లాగానే.. ఈ ఏడాది మహిళల క్రికెట్ జట్టులో జెమిమా రోడ్రిగ్స్ పేరు కూడా జాతీయంగా.. అంతర్జాతీయంగా బాగా మార్మోగింది. వన్డ్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై వీర బాదుడు బాదింది. నాటౌట్గా నిలిచి ఫైనల్కు చేర్చింది. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలోనూ.. మీడియా ఛానల్స్లోనూ ఆమె పేరు ఎక్కువగా వినిపించింది.

రేఖా గుప్తా
రేఖా గుప్తా.. ఢిల్లీ ముఖ్యమంత్రి. ఈ ఏడాది దేశ రాజధానిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరేసింది. అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ముఖ్యమంత్రి పదవి వరించింది. బీజేపీ అధిష్టానం సీనియర్లను పక్కనపట్టి రేఖా గుప్తాకు అవకాశం ఇచ్చారు. ఇలా రేఖా గుప్తా పేరు కూడా చరిత్ర సృష్టించారు.

మైథిలి ఠాకూర్
మైథిలి ఠాకూర్.. జానపద గాయని. ప్రధాని మోడీ చేత ప్రశంసలు అందుకుంది. అనూహ్యంగా ఈ ఏడాది రాజకీయాల్లోకి ప్రవేశించి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందింది. నవంబర్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ నుంచి పోటీ చేసి మైథిలి ఠాకూర్ విక్టరీ సాధించారు. ఇలా అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించింది.

తాజావార్తలు
-
Preity Mukhundhan: ఫైట్స్తో పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ను ఆడించాలి!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!