2025 Crimes Rewind: గోల్డ్ స్మగ్లింగ్ దగ్గర నుంచి హనీమూన్ మర్డర్ వరకు..! ఈ ఏడాది క్రైమ్ సీన్స్ ఇవే!
- ఇంకొన్ని గంటల్లో ముగియనున్న 2025 సంవత్సరం
- ఈ ఏడాది సంచలనం సృష్టించిన క్రైమ్ కేసుల్లో మహిళలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంకొన్ని గంటల్లో 2025 సంవత్సరం ముగియనుంది. 2026 సంవత్సరానికి వెల్కమ్ పలకనున్నారు. అయితే ఈ ఏడాది అనేక క్రైమ్ సీన్లలో నారీమణులు ప్రముఖ పాత్ర పోషించారు. అడ్డదారులు తొక్కి కటకటాల పాలయ్యారు. కొందరు మహిళలు చరిత్ర సృష్టిస్తే.. ఇంకొందరు మహిళలు నేరాలకు పాల్పడి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. వారు ఎవరు? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
రన్యారావు..
రన్యారావు కన్నడ నటి. తండ్రి ఐపీఎస్ అధికారి రామచంద్రరావు. మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ దొరికిపోయింది. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని వీఐపీ సౌకర్యాన్ని ఉపయోగించుకుని తప్పించుకుంది. అయితే పాపం పండి దొరికిపోయింది. ప్రస్తుతం జైల్లో మగ్గుతోంది. దాదాపు రూ.17 కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంట్లో సోదాలు చేయగా.. కోట్ల విలువైన ఆభరణాలతో పాటు భారీగా నగదు లభ్యమైంది.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు

మీరుట్ హత్య
మీరుట్ హత్య యావత్తు దేశాన్ని కుదిపేసింది. నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ను భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలు అత్యంత దారుణంగా హతమార్చి శరీరాన్ని ముక్కులుగా చేసి డ్రమ్ములో వేసి సిమెంట్తో కప్పేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. డ్రగ్స్ బానిసలుగా మారిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

సోనమ్ రఘువంశీ
సోనమ్ రఘువంశీ(యూపీ).. ఇండోర్కు చెందిన రాజా రఘువంశీని మే 9న వివాహం చేసుకుంది. అనంతరం హనీమూన్ మర్డర్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి కిరాయి హంతకులతో అంతమొందించింది. అనంతరం భర్త మృతదేహాన్ని లోయలో పడేసి ప్రియుడు రాజ్ కుశ్వాహా పారిపోయింది. జూన్లో సోనమ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు ఈ ఘటనపై సినిమా కూడా రాబోతుంది.

జ్యోతి మల్హోత్రా
జ్యోతి మల్హోత్రా పేరు పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పేరు మార్మోగింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్ర దాడి జరిగింది. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారతదేశం పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇక రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టగా జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్కు ఐఎస్ఐ ఏజెంట్గా పని చేసినట్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ అధికారులతో అంటకాగినట్లుగా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతోంది.

డాక్టర్ షాహీన్ సయీద్
షాహీన్ సయీద్.. దేశ వ్యాప్తంగా భారీ ఉగ్ర దాడులకు ప్లాన్ చేసింది. సహచర డాక్టర్లు ఉమర్, ముజమ్మిల్తో కలిసి బాంబ్ పేలుళ్లకు కుట్ర పన్నింది. డిసెంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన కారు బ్లాస్ట్లో డాక్టర్ ఉమర్ హతమయ్యాడు. వీళ్లంతా అల్-ఫలాహ యూనివర్సిటీ వేదికగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తు బృందం గుర్తించింది. ప్రస్తుతం నిందితులు జైల్లో ఉన్నారు.

తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!