Lithium Mining: లిథియం, కోబాల్ట్ వేలం.. 20 బ్లాకులకు రూ. 45,000 కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lithium Mining: ప్రపంచంలోనే అత్యంత విలువైన మూలకాల్లో ఒకటిగా ఉన్న లిథియం, కోబాల్ట్, టైటానియం, కోబాల్ట్ మూలకాల వేలాన్ని బుధవారం కేంద్రం ప్రారంభించింది. తొలి విడతగా 20 బ్లాకులను వేలం వేయనున్నట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వీటి విలువ రూ. 45,000 కోట్లు ఉంటుందని చెప్పారు. మొత్తం 100 బ్లాకులను వేలం కోసం గుర్తించామని, వీటిలో తొలి విడతగా 20 బ్లాకుల్ని వేలం వేస్తున్నామని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ 20 బ్లాకులు ఉత్తరప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్ మరియు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి.
Read Also: Sniffer Dog: నువ్వు కుక్కవి కాదు ‘లియో’వి.. తప్పిపోయిన చిన్నారిని 3 గంటల్లోనే కనుగొంది..
Also Read
- CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
- Gurugram: గురుగ్రామ్పై జలఖడ్గం.. 10 కి.మీ ట్రాఫిక్ జామ్.. ఎటుచూసినా నీళ్లే
- Bihar: ప్రశాంత్ కిషోర్కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్లో టఫ్ ఫైట్
- Wayanad: వయనాడ్లో కొండచరియలు బీభత్సం.. నలుగురు మృతి.. వీడియో వైరల్
ఈ 20 బ్లాకుల్లో 16కి కాంపోజిట్ లైసెన్సులు జారీ చేస్తారు, మిగిలిన నాలుగింటికి లైసెన్సులు జారీ చేయబడుతాయి. కాంపోజిట్ లైసెన్సుల కింద నిల్వల అణ్వేషణ అనుమతించబడుతుంది. టెండర్ కోట్ చేసిన వారిలో అత్యధిక రాయల్టీ రేట్ల ఆధారంగా బిడ్డర్లను కేంద్రం ఎంపిక చేయనుంది. టెండర్ డాక్యుమెంట్ల విక్రయం బుధవారం నుంచే ప్రారంభమవుతుంది. గనులు, ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, ప్రకారం ఆగస్టులో 24 ఖనిజాలను క్రిటికల్, స్ట్రాటజిక్ ఖనిజాలుగా నోటిఫై చేసింది.
ముఖ్యంగా గతేడాది జమ్మూకాశ్మీర్ రియాసి జిల్లాలో భారీ ఎత్తున లిథియం నిల్వలు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ప్రస్తుత జనరేషన్లో మొబైళ్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు బ్యాటరీల్లో లిథియంని వాడుతున్నారు. సోలార్ ఎనర్జీని స్టోర్ చేయాలంటే బ్యాటరీలు చాలా అవసరం. 2030 నాటికి శిలాజ ఇంధనాల స్థానంలో సోలార్ ఎనర్జీ వంటి శిలాజేతర విద్యుత్ సామర్థ్యాన్ని 50 శాతానికి పెంచాలని భారత్ అనుకుంటోంది. దీనికి లిథియం చాలా కీలకం. కోబాల్ట్ స్టోరేజ్ అప్లికేషన్స్లో కీలకమైన మూలకం. టైటానియం రక్షణ పరిశ్రమలో విస్తృతంగా వినియోగిస్తారు. భవిష్యత్ సాంకేతికతలు లిథియం, గ్రాఫైట్, కోబాల్ట్, టైటానియం వంటి రేర్ ఎర్త్ మూలకాలపై ఆధారపడి ఉంది.
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!