Lithium Mining: లిథియం, కోబాల్ట్ వేలం.. 20 బ్లాకులకు రూ. 45,000 కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lithium Mining: ప్రపంచంలోనే అత్యంత విలువైన మూలకాల్లో ఒకటిగా ఉన్న లిథియం, కోబాల్ట్, టైటానియం, కోబాల్ట్ మూలకాల వేలాన్ని బుధవారం కేంద్రం ప్రారంభించింది. తొలి విడతగా 20 బ్లాకులను వేలం వేయనున్నట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వీటి విలువ రూ. 45,000 కోట్లు ఉంటుందని చెప్పారు. మొత్తం 100 బ్లాకులను వేలం కోసం గుర్తించామని, వీటిలో తొలి విడతగా 20 బ్లాకుల్ని వేలం వేస్తున్నామని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ 20 బ్లాకులు ఉత్తరప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్ మరియు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి.
Read Also: Sniffer Dog: నువ్వు కుక్కవి కాదు ‘లియో’వి.. తప్పిపోయిన చిన్నారిని 3 గంటల్లోనే కనుగొంది..
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
ఈ 20 బ్లాకుల్లో 16కి కాంపోజిట్ లైసెన్సులు జారీ చేస్తారు, మిగిలిన నాలుగింటికి లైసెన్సులు జారీ చేయబడుతాయి. కాంపోజిట్ లైసెన్సుల కింద నిల్వల అణ్వేషణ అనుమతించబడుతుంది. టెండర్ కోట్ చేసిన వారిలో అత్యధిక రాయల్టీ రేట్ల ఆధారంగా బిడ్డర్లను కేంద్రం ఎంపిక చేయనుంది. టెండర్ డాక్యుమెంట్ల విక్రయం బుధవారం నుంచే ప్రారంభమవుతుంది. గనులు, ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, ప్రకారం ఆగస్టులో 24 ఖనిజాలను క్రిటికల్, స్ట్రాటజిక్ ఖనిజాలుగా నోటిఫై చేసింది.
ముఖ్యంగా గతేడాది జమ్మూకాశ్మీర్ రియాసి జిల్లాలో భారీ ఎత్తున లిథియం నిల్వలు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ప్రస్తుత జనరేషన్లో మొబైళ్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు బ్యాటరీల్లో లిథియంని వాడుతున్నారు. సోలార్ ఎనర్జీని స్టోర్ చేయాలంటే బ్యాటరీలు చాలా అవసరం. 2030 నాటికి శిలాజ ఇంధనాల స్థానంలో సోలార్ ఎనర్జీ వంటి శిలాజేతర విద్యుత్ సామర్థ్యాన్ని 50 శాతానికి పెంచాలని భారత్ అనుకుంటోంది. దీనికి లిథియం చాలా కీలకం. కోబాల్ట్ స్టోరేజ్ అప్లికేషన్స్లో కీలకమైన మూలకం. టైటానియం రక్షణ పరిశ్రమలో విస్తృతంగా వినియోగిస్తారు. భవిష్యత్ సాంకేతికతలు లిథియం, గ్రాఫైట్, కోబాల్ట్, టైటానియం వంటి రేర్ ఎర్త్ మూలకాలపై ఆధారపడి ఉంది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!