Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇద్దరు భారత సైనికులు మరణించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ జవాన్ల మరణాలను నిర్ధారించింది. సైనికులు నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి గస్తీలో ఉండగా ఐఈడీ దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిందని సైన్యం తెలిపింది.
Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దుల్లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు భారత జవాన్లు మరణం..
- జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి..
- పాక్ సరిహద్దుల్లో ఐఈడీ పేలుడు..
- ఇద్దరు భారత జవాన్లు మృతి..