Woman Assaulted: త్రిపురకు చెందిన 19 ఏళ్ల యువతి గురుగ్రామ్లో తన లివ్-ఇన్ భాగస్వామి చేతలో దాడికి గురైన ఘటన కలకలం రేపుతోంది. తీవ్ర గాయాలైన యువతిని ఢిల్లీలోని AIIMS ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే, బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె వ్యక్తిత్వంపై అనుమానంతో శివమ్ దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: MLA Ramachandru Naik: నర్సింహులపేట మండలం లో ఇసుక అక్రమ రవాణా.. రంగంలోకి ఎమ్మెల్యే రామచంద్రు నాయక్
దక్షిణ గురుగ్రామ్ డీసీపీ హితేష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు గురుగ్రామ్లోని GD గోయెంకా విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ చదువుతోంది అన్నారు. బాధిత యువతి- శివమ్ అనే యువకుడితో కలిసి సెక్టర్ 69లోని పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో నివసిస్తోంది.. వీరికి 2025 సెప్టెంబర్లో పరిచయం కాగా, పెళ్లి విషయమై కుటుంబాల మధ్య చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక, పెళ్లి గురించి చర్చ జరుగుతుండగా చిన్న వివాదంతో యువకుడు బాధితురాలిని కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత గురుగ్రామ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. గాయాలు ఎక్కువగా ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. ప్రస్తుతం అక్కడ యువతికి చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. యువతిపై దాడికి పాల్పడిన శివమ్ ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
