Uttarakhand: ప్రాణాలు తీసిన రోడ్డు ప్రమాదాలు.. 24 గంటల్లో 19 మంది మృతి
- ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదాలు
- గడిచిన 24 గంటల్లో ఐదు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు
- 19 మంది మృతి.. 35 మందికి తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదాలు పలువురిని బలి తీసుకున్నాయి. గడిచిన 24 గంటల్లో ఐదు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 19 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్లోని 13 జిల్లాల్లో ఆదివారం సాయంత్రం వరకు మూడు కార్లు పౌరీలో లోతైన లోయలో పడిపోయాయి. కాగా, శనివారం రుద్రప్రయాగ్లోని అలకనంద నదిలో టెంపో ట్రావెలర్ పడిపోవడంతో 14 మంది ప్రయాణికులు మృతి చెందారు. హల్ద్వానీలో కూడా ఓ కారు లోతైన లోయలో పడిపోవడంతో ఒకే కుటుంబంలోని ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
BJP: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో బీజేపీ నేతల సీక్రెట్ సమావేశం..ఎజెండా ఏంటి?
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
అయితే.. ఈ ప్రమాదాలకు గల కారణం.. కొండలపై అతివేగంతో పాటు డ్రైవర్లు నిద్రపోవడం వల్లనే అని నిపుణులు చెబుతున్నారు. డ్రైవర్ కొద్దిపాటి అజాగ్రత్త వహిస్తే.. ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆదివారం సాయంత్రం పూరీ జిల్లాలో జరిగిన ప్రమాదంలో.. టాక్సీ సహా రెండు ప్రైవేట్ కార్లు కాలువలో పడిపోయాయి. మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ఆ తరువాత.. ఖిర్సు-కతులి లింక్ మోటార్వేపై వివాహ కారు ప్రమాదానికి గురై లోతైన కాలువలో పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని విమానంలో ఆస్పత్రికి తరలించారు. మరో ఘటన.. సత్పులిలోని దంగ్లేశ్వర్ మహాదేవ్ దేవాలయం సమీపంలో రెట్పూర్ నుంచి సత్పులి వైపు వెళ్తున్న ఆల్టో కారు అదుపు తప్పి 100 మీటర్ల దూరంలో ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి.
Bhairava Anthem: మరి కొద్దీ గంటల్లో భైరవ గీతం.. ప్రభాస్ ఫ్యాన్స్ బి రెడీ..
ప్రమాదాలపై పురి డీఎం డాక్టర్ ఆశిష్ చౌహాన్ విచారం వ్యక్తం చేస్తూ ప్రమాదాలపై సమీక్షిస్తామన్నారు. రోడ్డు భద్రతపై అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో శనివారం ఉదయం టెంపో ట్రావెలర్ నదిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో టెంపో ట్రావెలర్లో మొత్తం 26 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్నారు. టెంపో ట్రావెలర్ నదిలో పడి 14 మంది పర్యాటకులు మృతి చెందగా, 12 మంది పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఢిల్లీ, నోయిడా తదితర నగరాల నుంచి ఉత్తరాఖండ్లోని చోప్తాకు సందర్శనార్థం వెళ్తున్న పర్యాటకులు ఉన్నారు. గాయపడిన వారిని ఎయిర్ లిఫ్టు చేసి రిషికేశ్లోని ఎయిమ్స్కు తరలించారు. ప్రమాద సమయంలో కారు బ్రేకులు ఫెయిల్ అయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. శనివారం సాయంత్రం బెరినాగ్ నుంచి హల్ద్వానీకి వెళ్తున్న ఓ కుటుంబం కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో అల్మోరా జిల్లాలోని భత్రౌంజ్ఖాన్ సమీపంలో 500 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. క్షతగాత్రులను రక్షించి రామ్నగర్ ఆసుపత్రికి, ఆపై హల్ద్వానీకి తరలించారు.
తాజావార్తలు
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!