Yogi Adityanath: ఎన్కౌంటర్లలో 166 మంది నేరస్తులను లేపేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
166 Criminals Killed In Encounters In Last 5 Years, Says Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. నేరాలకు పాల్పడే వారి ఇళ్లను, ఆస్తులను బుల్డోజర్లతో కూలగొట్టి నేరస్తుల్లో భయాన్ని పుట్టిస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వాల హయాంలో యూపీలో పేరుకు పోయిన నేరాలను, మాఫియాలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎన్ కౌంటర్లతో నేరస్తులను ఎలిమినేట్ చేస్తోంది యోగి సర్కార్.
ఇదిలా ఉంటే గత ఐదేళ్లలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లలో 166 మంది నేరస్తులను లేపేశాం అని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. 4,453 మంది గాయపడ్డారని ఆయన శుక్రవారం అన్నారు. నేరాలపై తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తుందని తెలిపారు. 2017-2022 మధ్య 13 మంది పోలీసులు కూడా మరణించారని.. వెయ్యి మంది పైగా గాయపడ్డారని తెలిపారు. లక్నోలో జరిగిన రిజర్వ్ పోలీస్ లైన్స్ లో జరిగిన పోలీస్ మోమోరియల్ డే పరేడ్ లో ఆయన ప్రసంగించారు.
Also Read
- PM Modi Viral Video Row: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువతిపై కేసు నమోదు
- Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
- PM Modi: పార్లమెంట్ ఉభయ సభల్లో యాంటీ-పేపర్ లీక్ బిల్ పాస్.. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
Read Also: Jharkhand:సాఫ్ట్వేర్ ఇంజనీర్పై సామూహిక అత్యాచారం.. సిట్ ఏర్పాటు చేసి ప్రభుత్వం
అమవీరులైన కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన అన్నారు. వారి సంక్షేమం, అవసరాలు తీర్చేందుకు హామీ ఇస్తున్నాని వెల్లడించారు. పోలీస్ సిబ్బందికి మోటార్ సైకిత్ భత్యం రూ. 500 ప్రకటించారు. గత ప్రభుత్వాలు దీని కోసం రూ. 200 చెల్లించేవి. పోలీసులు ఫోన్ అలవెన్స్ సంవత్సరానికి రూ. 2000 అదనంగా చెల్లించుతోంది ప్రభుత్వం. రూ. 5 లక్షల వరకు మెడికల్ బిల్లలను డీజీపి క్లియర్ చేస్తారని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
2019 కుంభమేళా, 2022 అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించినందుకు పోలీసులను అభినందించారు సీఎం. కోవిడ్ సమయంలో పోలీసుల కృషి ప్రత్యేకంగా నిలిచిందని అన్నారు. 22,000 మంది మహిళలతో పాటు మొత్తం 1,50,231 మంది అభ్యర్థులను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు రిక్రూట్ చేసుకున్నారని.. 45,689 పోస్టులకు రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. 2017-18లో పోలీస్ బడ్జెట్ రూ. 16,115 కోట్లు కాగా.. 2021-22 నాటికి అది రూ.30,203 కోట్లకు పెరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. 244 కొత్త పోలీస్ స్టేషన్లు,133 అవుట్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
-
World Cup 2027: వరల్డ్ కప్లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!
-
PM Modi Viral Video Row: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువతిపై కేసు నమోదు
-
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!