Road Accident: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
Road Accident: మధ్యప్రదేశ్లోని బేతుల్లో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సు, కారు ముందు వైపు నుండి ఒకదానికొకటి ఢీకొట్టకున్నాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందిరు. అయితే ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కాగా.. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై బేతుల్ ఎస్పీ సిమ్లా ప్రసాద్ కు సమాచారం అందించారు. అయితే.. ఫోటోలో వున్న విధంగా చూస్తే.. బస్సు – కారు ఎదురెదురుగా ఢీకొన్నాయని అర్థం అవుతోంది. కారు ఎలా తుక్కుతుక్కు అయిందో చూడవచ్చు. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారని భావిస్తున్నారు. బస్సు ముందు భాగం మాత్రమే దెబ్బతింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 మంది కూలీలు మహారాష్ట్రలోని అమరావతి నుంచి తిరిగి వస్తుండగా గుడ్గావ్ మరియు భైస్దేహి మధ్య ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ బస్సును ఢీకొనడానికి ముందు డ్రైవర్ నిద్రమత్తులో పడిపోయాడు. ఏడు మృతదేహాలను వెంటనే బయటకు తీశామని, అయితే మిగిలిన మృతదేహాలను బయటకు తీయడానికి వాహనాన్ని చెక్కాల్సి ఉందని బేతుల్ సీనియర్ పోలీసు అధికారి సిమ్లా ప్రసాద్ తెలిపారు.
Also Read
- Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
- Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
Betul, Madhya Pradesh | 11 people died in a bus accident which collided with a car near Jhallar police station. One injured person has been admitted to a hospital: SP Betul Simala Prasad pic.twitter.com/aNPQmt5VIF
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 4, 2022
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹ 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బెతుల్లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, మరణించిన ప్రతి ఒక్కరికి తదుపరి బంధువులకు PMNRF నుండి ₹ 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వబడుతుందని, క్షతగాత్రులకు ₹ 50,000 అందజేస్తాం’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Pained by the loss of lives due to an accident in Betul, MP. Condolences to the bereaved families. May the injured recover soon. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Rs. 50,000 would be given to the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 4, 2022
గతనెల అక్టోబర్ 21 రాత్రి మధ్యప్రదేశ్లోని రేవాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. పండుగరోజు దీపావళికి రెండు రోజుల ముందే రేవా జిల్లాలోని సోహగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోహగి పర్వతాల వద్ద బస్సు ట్రక్కు ఢీకొట్టడంతో.. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి యూపీ రాజధాని లక్నో వస్తున్న ఈ బస్సులో రోజు కూలీలు ఉన్నారు. దీంతో మధ్యప్రదేశ్లో వరుస ప్రమాదాలపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
PVN Madhav: తాళాలు పగులగొట్టి గోడలు దూకడం ఏంటి?
తాజావార్తలు
-
Roti Pizza Recipe: మిగిలిపోయిన రోటీలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా.. మార్కెట్లో దొరికే పిజ్జాని మర్చిపోతారంతే..!
-
Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్వెల్.. రెండేళ్ల నిషేధం
-
Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
-
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!