PVN Madhav: తాళాలు పగులగొట్టి గోడలు దూకడం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పోలీసుల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్. తాళాలు పగులగొట్టి గోడలు దూకడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈనెల 11, 12 తేదీల్లో ప్రధాని మోదీ విశాఖ పర్యటన వుంటుందన్నారు. 15 పథకాలతో పాటు పలు శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ పర్యటనను వాళ్ల పార్టీ కార్యకలాపాలతో కలిపి కలగాపులగం చేస్తున్నారు. గతంలో అల్లూరి శత జయంతిని ఇలాగే ఖరాబు చేశారు. విశాఖలో ఇప్పటికే పాలన భ్రష్టు పట్టించారు. భూ కబ్జాలు పెరిగిపోయాయి. విపక్షాల అణచివేత చట్ట విరుద్ధంగా సాగుతోంది.. వీటిని ఖండిస్తున్నామన్నారు.
Read Also:Tiger attacks: బాబోయ్ పులులు.. ఎడాపెడా దాడులు
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
జన సేన నేత పవన్ కల్యాణ్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కోర్టు మొట్టికాయలు వేసినా తీరుమార్చుకోలేదు. పవన్ కల్యాణ్ మీద రెక్కీ దారుణం. ఆయనకు సెక్యూరిటీ పెంచాలి. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇపుడు మళ్లీ అయ్యన్న పాత్రుడిని వేధించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిన పోలీసులే తాళాలు పగలగొట్టి, గోడలు దూకీ వెళ్లటం ఏంటన్నారు. ఆ విషయంలో కోర్ట్ చీవాట్లు పెట్టింది. మోడీ 11 రాత్రి విశాఖ చేరుకుంటారు. 12 న రోడ్ షో, సభ ఉంటాయి. సోము వీర్రాజు నేతృత్వాన ఏర్పాట్లు చేస్తాం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు మోదీజీ పర్యటన విజయవంతం చేయాలి. స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ కు కట్టుబడి ఉన్నామన్నారు మాధవ్.
బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లపై మాధవ్ మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో అయినా వేరే పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరితే వారు పదవికి రాజీనామా చేసి గెలవాల్సి ఉంటుంది. మునుగోడు ఎన్నికల నేపధ్యంలో కెసిఆర్ డ్రామా ఆడారు కానీ ఫెయిలయ్యారు. తెలంగాణలో కూడా ఎవరన్నా చేరితే రాజీనామా చేయాల్సిందే. మరి కూరగాయలను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం ఏముంది? బిజెపి ఎప్పుడూ అ పని చెయ్యదన్నారు. కేవలం చిన్న విషయాలను కేసీఆర్ భూతద్దంలో చూపిస్తున్నారు. అధికారంలో మీరే ఉన్నారు సిబిఐ ఎంక్వయిరీ వేయాలన్నారు ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్.
Read ALso: Usha Thakur: రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలి.. మహిళా మంత్రి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..