PVN Madhav: తాళాలు పగులగొట్టి గోడలు దూకడం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పోలీసుల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్. తాళాలు పగులగొట్టి గోడలు దూకడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈనెల 11, 12 తేదీల్లో ప్రధాని మోదీ విశాఖ పర్యటన వుంటుందన్నారు. 15 పథకాలతో పాటు పలు శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ పర్యటనను వాళ్ల పార్టీ కార్యకలాపాలతో కలిపి కలగాపులగం చేస్తున్నారు. గతంలో అల్లూరి శత జయంతిని ఇలాగే ఖరాబు చేశారు. విశాఖలో ఇప్పటికే పాలన భ్రష్టు పట్టించారు. భూ కబ్జాలు పెరిగిపోయాయి. విపక్షాల అణచివేత చట్ట విరుద్ధంగా సాగుతోంది.. వీటిని ఖండిస్తున్నామన్నారు.
Read Also:Tiger attacks: బాబోయ్ పులులు.. ఎడాపెడా దాడులు
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
జన సేన నేత పవన్ కల్యాణ్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కోర్టు మొట్టికాయలు వేసినా తీరుమార్చుకోలేదు. పవన్ కల్యాణ్ మీద రెక్కీ దారుణం. ఆయనకు సెక్యూరిటీ పెంచాలి. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇపుడు మళ్లీ అయ్యన్న పాత్రుడిని వేధించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిన పోలీసులే తాళాలు పగలగొట్టి, గోడలు దూకీ వెళ్లటం ఏంటన్నారు. ఆ విషయంలో కోర్ట్ చీవాట్లు పెట్టింది. మోడీ 11 రాత్రి విశాఖ చేరుకుంటారు. 12 న రోడ్ షో, సభ ఉంటాయి. సోము వీర్రాజు నేతృత్వాన ఏర్పాట్లు చేస్తాం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు మోదీజీ పర్యటన విజయవంతం చేయాలి. స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ కు కట్టుబడి ఉన్నామన్నారు మాధవ్.
బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లపై మాధవ్ మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో అయినా వేరే పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరితే వారు పదవికి రాజీనామా చేసి గెలవాల్సి ఉంటుంది. మునుగోడు ఎన్నికల నేపధ్యంలో కెసిఆర్ డ్రామా ఆడారు కానీ ఫెయిలయ్యారు. తెలంగాణలో కూడా ఎవరన్నా చేరితే రాజీనామా చేయాల్సిందే. మరి కూరగాయలను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం ఏముంది? బిజెపి ఎప్పుడూ అ పని చెయ్యదన్నారు. కేవలం చిన్న విషయాలను కేసీఆర్ భూతద్దంలో చూపిస్తున్నారు. అధికారంలో మీరే ఉన్నారు సిబిఐ ఎంక్వయిరీ వేయాలన్నారు ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్.
Read ALso: Usha Thakur: రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలి.. మహిళా మంత్రి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!