PVN Madhav: తాళాలు పగులగొట్టి గోడలు దూకడం ఏంటి?
ఏపీలో పోలీసుల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్. తాళాలు పగులగొట్టి గోడలు దూకడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈనెల 11, 12 తేదీల్లో ప్రధాని మోదీ విశాఖ పర్యటన వుంటుందన్నారు. 15 పథకాలతో పాటు పలు శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ పర్యటనను వాళ్ల పార్టీ కార్యకలాపాలతో కలిపి కలగాపులగం చేస్తున్నారు. గతంలో అల్లూరి శత జయంతిని ఇలాగే ఖరాబు చేశారు. విశాఖలో ఇప్పటికే పాలన భ్రష్టు పట్టించారు. భూ కబ్జాలు పెరిగిపోయాయి. విపక్షాల అణచివేత చట్ట విరుద్ధంగా సాగుతోంది.. వీటిని ఖండిస్తున్నామన్నారు.
Read Also:Tiger attacks: బాబోయ్ పులులు.. ఎడాపెడా దాడులు
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
జన సేన నేత పవన్ కల్యాణ్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కోర్టు మొట్టికాయలు వేసినా తీరుమార్చుకోలేదు. పవన్ కల్యాణ్ మీద రెక్కీ దారుణం. ఆయనకు సెక్యూరిటీ పెంచాలి. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇపుడు మళ్లీ అయ్యన్న పాత్రుడిని వేధించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిన పోలీసులే తాళాలు పగలగొట్టి, గోడలు దూకీ వెళ్లటం ఏంటన్నారు. ఆ విషయంలో కోర్ట్ చీవాట్లు పెట్టింది. మోడీ 11 రాత్రి విశాఖ చేరుకుంటారు. 12 న రోడ్ షో, సభ ఉంటాయి. సోము వీర్రాజు నేతృత్వాన ఏర్పాట్లు చేస్తాం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు మోదీజీ పర్యటన విజయవంతం చేయాలి. స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ కు కట్టుబడి ఉన్నామన్నారు మాధవ్.
బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లపై మాధవ్ మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో అయినా వేరే పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరితే వారు పదవికి రాజీనామా చేసి గెలవాల్సి ఉంటుంది. మునుగోడు ఎన్నికల నేపధ్యంలో కెసిఆర్ డ్రామా ఆడారు కానీ ఫెయిలయ్యారు. తెలంగాణలో కూడా ఎవరన్నా చేరితే రాజీనామా చేయాల్సిందే. మరి కూరగాయలను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం ఏముంది? బిజెపి ఎప్పుడూ అ పని చెయ్యదన్నారు. కేవలం చిన్న విషయాలను కేసీఆర్ భూతద్దంలో చూపిస్తున్నారు. అధికారంలో మీరే ఉన్నారు సిబిఐ ఎంక్వయిరీ వేయాలన్నారు ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్.
Read ALso: Usha Thakur: రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలి.. మహిళా మంత్రి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!