Indore Water Tragedy: ఇండోర్లో జల విషాదం.. 11 మంది మృతి
- ఇండోర్లో జల విషాదం
- 11 మంది మృతి
- 1,400 మందికి అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా పిలువబడే పట్టణంలో కలుషిత నీరు కారణంగా దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,400 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
తీవ్ర విషాదం
10 పదేళ్ల తర్వాత జూలై 8న ఒక బిడ్డ జన్మించాడు. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. కానీ కలుషిత నీరు కారణంగా మృత్యువు వెంటాడింది. పాలల్లో కలుషిత నీరు కలవడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read
ఇది కూడా చదవండి: Afghanistan: ఆకస్మిక వరదలు.. 17 మంది మృతి, రోడ్డున్న పడ్డ 1,800 కుటుంబాలు..!
పరిశుభ్రతకు మారుపేరు ఇండోర్ నగరం. అలాంటిది మంచి నీళ్ల పైప్లైన్లో డ్రైనేజీ వాటర్ కలిసింది. ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మంచినీళ్ల పైప్లైన్లో కలుషిత నీరు కలుస్తుందని ప్రజలు మొర్ర పెట్టుకున్నా పట్టించుకోలేదు. వాస్తవంగా భగీరత్పుర పైప్లైన్ను మార్చడానికి 2025 ఆగస్టులోనే టెండర్ దాఖలు చేయబడిందని వర్గాలు తెలిపాయి. రూ. 2.4 కోట్ల అంచనా వ్యయంతో దాఖలైంది. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఇంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: OTR: టీడీపీ, వైసీపీ రాజకీయాల మధ్య తిరుమల దర్శనాల వివాదం!
అధికారుల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇక వైద్య పరీక్షల్లో కూడా కలుషిత నీరు కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు అందాయి. అలాగే మంత్రి కైలాష్ విజయవర్గియా కూడా తాగునీటిలో మురుగునీరు కలవడమే కారణమని అంగీకరించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?