Cash Seizure: కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.. ఈ ఎన్నికల్లో ఇప్పటికే రూ.1,021 కోట్లు సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశంలో అసెంబ్లీ ఎన్నికల జోరు సాగుతోంది. ఈ ఎన్నికల పోరు ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో కొనసాగుతున్నది. కాగా ఎన్నికల బరిలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో లెక్కాపత్రం లేని నగదు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని సీబీడీటీ ఛైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సీబీడీటీ ఛైర్మన్ నితిన్ గుప్తా మాట్లాడుతూ. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికలు ముందే ఆదాయ పన్ను విభాగంతో సహా దర్యాప్తు సంస్థలు నల్లధనం పైన నిఘా పెంచాయని తెలిపారు. కాగా టోల్ఫ్రీ నెంబర్ల ద్వారా సరైన ఆధారాలు లేని నగదు, నగలకు సంబంధించిన సమాచారం తమకు అందుతోందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో ఆధారాలు లేని నగదు, ఆభరణాలకు సంబంధించిన సోదాలు ముమ్మరం చేసామని గుప్తా వెల్లడించారు.
Read also:Train Accident: పట్టాలపై చెక్క దిమ్మె, ఇనుప రాడ్లు.. రైలును ఢీకొట్టించే కుట్ర
Also Read
- Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
- NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్హౌజ్..
అలానే ఈ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం సహా రాష్ట్రాల ఎన్నికల అథారిటీ సమన్వయంతో జరుగుతున్నట్లు తెలిపారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఓటర్లకు ఉచిత కానుకలు, నగదు, మందు, మాధకద్రవ్యాల పంపిణీని అరికట్టేందుకు జులైలో లోనే అధికారులు పాటించాల్సిన నిబంధనలను సీబీఐసీ జారీ చేసిందని.. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు వీటిని రూపొందించిందని తెలిపిన ఆయన.. ఎన్నికల నేపథ్యంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా నిఘా పెంచిందని తెలిపారు. ఈ నేపథ్యంలో చేసిన తనిఖీలలో రాజస్థాన్లో అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, వెండి.. స్వాధీనం గతంతో పోలిస్తే మూడింతలు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. 2021 లో స్వాధీనం చేసుకున్న వాటి విలువ .322 కోట్లు ఉండగా 2022లో రూ.347 కోట్లు ఉంది. అయితే 2023లో అక్టోబర్ వరకు రూ.1,021 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
9000mAh Battery Smartphones 2026: 9000mAh బ్యాటరీతో 2026లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. పూర్తి జాబితా!
-
The Deverakonda Foundation : స్వగ్రామంలో 180 మంది విద్యార్థులకు స్కాలర్షిప్… విజయ్ దేవరకొండ గొప్ప మనసు
-
Shubman Gill: నేను ఇప్పటివరకు గుర్తుండిపోయే క్యాచ్ అందుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది!
-
Best Electric Scooters: ఓలా, హీరో, టీవీఎస్.. హైయెస్ట్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? కేవలం రూ.44,990 నుంచే ప్రారంభం!
-
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!