Aircraft Crashes: భారతదేశంలో జరిగిన 10 అతిపెద్ద విమాన ప్రమాదాలు..
- భారతదేశంలో జరిగిన అతిపెద్ద 10 విమాన ప్రమాదాలు..
- తాజాగా అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్..
Aircraft Crashes: ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ప్రమాదం సమయంలో 242 మంది విమానంలో ఉన్నారు. ఈ ప్రమాదంలో వందలాది మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
* ఆగస్టు7, 2020, కాలికట్ ఎయిర్ క్రాష్: మనదేశంలో చివరిసారిగా అతిపెద్ద విమాన ప్రమాదం 2020లో కాలికట్లో నమోదైంది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read
* మే 22, 2010 మంగళూర్ఎయిర్ క్రాష్: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 812 విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. టేబుల్ టాప్ రన్ వే ప్రమాదానికి కారణమైంది. 158 మంది ప్రాణాలు కోల్పో్యారు.
*జూలై 17, 2000, పాట్నా ఎయిర్ క్రాష్: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 కు చెందిన బోయింగ్ 737 విమానం పాట్నాలో ల్యాండింగ్ సమయంలో కూలిపోయి 60 మందికి పైగా మరణించింది. పైలట్ లోపం కారణంగా నియంత్రణ కోల్పోవడమే దీనికి కారణం.
*నవంబర్ 12, 1996, చార్ఖీ దాద్రి మిడ్-ఎయిర్ కొలిషన్: సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ బోయింగ్ 747 మరియు కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషిన్ ఇల్-76 ఢిల్లీ సమీపంలో ఆకాశంలోనే ఢీకున్నాయి. రెండు విమానాల్లోని 349 మంది మరణించారు. పైలట్ లోపం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమాచారం లోపం కారణంగా ప్రమాదం జరిగింది.
*ఏప్రిల్ 26, 1993, ఔరంగాబాద్ ఎయిర్ క్రాష్: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 491, బోయింగ్ 737, ఔరంగాబాద్ నుండి టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయి ట్రక్కు మరియు విద్యుత్ లైన్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 55 మంది మరణించారు.
* ఆగస్టు 16, 1991, ఇంఫాల్ ఎయిర్ క్రాష్: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 257 ఇంఫాల్ సమీపంలో కూలిపోయింది, విమానంలో ఉన్న మొత్తం 69 మంది మరణించారు.
* ఫిబ్రవరి 14, 1990, బెంగళూరు విమాన ప్రమాదం: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605, ఎయిర్బస్ A320 మోడల్, బెంగళూరుకు చేరువలో కూలిపోయింది, 92 మంది మరణించారు.
* అక్టోబర్ 19, 1988, అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 113 అహ్మదాబాద్లో కూలిపోయింది, 133 మంది మరణించారు.
* జూన్ 21, 1982, బాంబే ఎయిర్ క్రాష్: ఎయిర్ ఇండియా విమానం 403 బాంబే విమానాశ్రయంలో కూలిపోయింది, 17 మంది మరణించారు.
* జనవరి 1, 1978, బాంబే ఎయిర్ క్రాష్: ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 747 ముంబై నుండి టేకాఫ్ అయిన తర్వాత అరేబియా సముద్రంలో కూలిపోయింది, విమానంలో ఉన్న మొత్తం 213 మంది మరణించారు.
తాజావార్తలు
-
Siddharth-Trisha: సిద్ధార్థ్-త్రిష ‘క్లాసిక్’ రీ-యూనియన్..!
-
Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్కు తొలి ఆహ్వానం!
-
Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
-
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
-
Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?