Aircraft Crashes: భారతదేశంలో జరిగిన 10 అతిపెద్ద విమాన ప్రమాదాలు..
- భారతదేశంలో జరిగిన అతిపెద్ద 10 విమాన ప్రమాదాలు..
- తాజాగా అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aircraft Crashes: ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ప్రమాదం సమయంలో 242 మంది విమానంలో ఉన్నారు. ఈ ప్రమాదంలో వందలాది మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
* ఆగస్టు7, 2020, కాలికట్ ఎయిర్ క్రాష్: మనదేశంలో చివరిసారిగా అతిపెద్ద విమాన ప్రమాదం 2020లో కాలికట్లో నమోదైంది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read
* మే 22, 2010 మంగళూర్ఎయిర్ క్రాష్: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 812 విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. టేబుల్ టాప్ రన్ వే ప్రమాదానికి కారణమైంది. 158 మంది ప్రాణాలు కోల్పో్యారు.
*జూలై 17, 2000, పాట్నా ఎయిర్ క్రాష్: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 కు చెందిన బోయింగ్ 737 విమానం పాట్నాలో ల్యాండింగ్ సమయంలో కూలిపోయి 60 మందికి పైగా మరణించింది. పైలట్ లోపం కారణంగా నియంత్రణ కోల్పోవడమే దీనికి కారణం.
*నవంబర్ 12, 1996, చార్ఖీ దాద్రి మిడ్-ఎయిర్ కొలిషన్: సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ బోయింగ్ 747 మరియు కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషిన్ ఇల్-76 ఢిల్లీ సమీపంలో ఆకాశంలోనే ఢీకున్నాయి. రెండు విమానాల్లోని 349 మంది మరణించారు. పైలట్ లోపం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమాచారం లోపం కారణంగా ప్రమాదం జరిగింది.
*ఏప్రిల్ 26, 1993, ఔరంగాబాద్ ఎయిర్ క్రాష్: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 491, బోయింగ్ 737, ఔరంగాబాద్ నుండి టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయి ట్రక్కు మరియు విద్యుత్ లైన్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 55 మంది మరణించారు.
* ఆగస్టు 16, 1991, ఇంఫాల్ ఎయిర్ క్రాష్: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 257 ఇంఫాల్ సమీపంలో కూలిపోయింది, విమానంలో ఉన్న మొత్తం 69 మంది మరణించారు.
* ఫిబ్రవరి 14, 1990, బెంగళూరు విమాన ప్రమాదం: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605, ఎయిర్బస్ A320 మోడల్, బెంగళూరుకు చేరువలో కూలిపోయింది, 92 మంది మరణించారు.
* అక్టోబర్ 19, 1988, అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 113 అహ్మదాబాద్లో కూలిపోయింది, 133 మంది మరణించారు.
* జూన్ 21, 1982, బాంబే ఎయిర్ క్రాష్: ఎయిర్ ఇండియా విమానం 403 బాంబే విమానాశ్రయంలో కూలిపోయింది, 17 మంది మరణించారు.
* జనవరి 1, 1978, బాంబే ఎయిర్ క్రాష్: ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 747 ముంబై నుండి టేకాఫ్ అయిన తర్వాత అరేబియా సముద్రంలో కూలిపోయింది, విమానంలో ఉన్న మొత్తం 213 మంది మరణించారు.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
-
PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!