మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను పొరుగింటివారి పెంపుడు కుక్క కరిచిందని తెలిసి.. దాన్ని తుపాకీతో కాల్చి చంపేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పొరిగింటివారు పోలీస్ కేసు పెట్టారు. అనంతరం ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 429 జంతువుల పట్ల క్రూరత్వం కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఆ కుక్కను కాల్చిన నిందితుడు.. తన భార్యకు, విధుల్లోకి వారందరికీ చేసిన గాయాలను పోలీసులకు తెలియచేశాడు. వారందరి వాదనలు విన్న తరువాతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.