ఓటీటీలో సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగా విడుదల అవుతున్నాయి. అందులో ఎక్కువగా హారర్ మూవీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ప్రముఖ ఓటీటీ సంస్థలు, దర్శకనిర్మాతలు ఈ వెబ్ సిరీసులను తెరకెక్కించేదుకు ఆసక్తి చూపిస్తుంటారు.. ఎక్కువగా క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తున్న సినిమాలు జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది..
హారర్ ఎలిమెంట్స్తోపాటు లవ్, రొమాన్స్, సస్పెన్స్ వంటి థ్రిల్లింగ్ అంశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల విడుదలైన ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది.. యాక్షణి పేరుతో సినిమా రాబోతుంది. సోషియో ఫాంటసీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్గా వచ్చిన ఇది ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 14 అంటే శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో యక్షిణి ప్రసారం అవుతోంది.. తెలుగుతో పాటుగా అన్ని భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది..
ఈ సిరీస్ ను డైరెక్టర్ తేజ మార్ని తెరకెక్కించారు.. ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్స్టార్తో కలిసి సంయుక్తంగా నిర్మించింది. ఈ వెబ్ సిరీస్కు ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరించారు.. ఈ సిరీస్ లో రాహుల్ విజయ్, మంచు లక్ష్మీ, వేదిక ప్రధాన పాత్రల్లో నటించారు.. ఈ సినిమా కథ విషయానికొస్తే.. అలకాపురి అనే లోకం నుంచి ఒక శాపం వల్ల భూమ్మీదకు వచ్చిన యక్షిణి వంద మందిని చంపితేగానీ శాప విముక్తి కాదు. ఆ వంద మందిని ఎలా చంపింది.. అనేది కథ..