యశ్ రాజ్ ఫిలిమ్స్ ఓటీటీ సక్సెస్ సాధిస్తుందా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా పుణ్యమా అని ఇండియాలో ఓటీటీ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ తర్వాత ఇండియా అతి పెద్ద ఓటీటీ మార్కెట్ గా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇండియన్ మార్కెట్ పై ఫోకస్ పెంచాయి. కరోనాతో థియేట్రికల్ రంగం కుదేలయిపోయింది. ఇప్పటికీ పలు ఏరియాల్లో థియేటర్లు ఓపెన్ కాలేదు. ఎంటర్ టైన్ మెంట్ ని ఇష్టపడే భారతీయులు తమ దృష్టిని ఓటీటీవైపు మళ్ళించారు. పలు అంతర్జాతీయ డిజిటల్ సంస్థలతో పాటు జాతీయంగానూ ఎన్నో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పుట్టుకు వచ్చాయి. కరోనా కనుమరుగై థియేట్రికల్ రంగంపై ఆశ చిగురిస్తున్నా… ఓటీటీ రంగంపై ఆసక్తి ఏమాత్రం తగ్గకపోగా రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో బడా కార్పోరేట్ సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల దృష్టి ఇప్పుడు సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రూపకల్పనపై పడింది.
టాలీవుడ్ విషయానికి వస్తే ట్రెండ్ కి అనుగుణంగా అడుగులు వేసే అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాను ఆరంభించి విజయం సాధించారు. ఆరంభంలో ఆటుపోటులు ఎదుర్కొన్నా అదరక బెదరక దాని అభివృద్ధి కోసం అహోరాత్రులు శ్రమించారు. టాలీవుడ్ లో సక్సెస్ సాధించిన అరవింద్ ఇతర దక్షిణాది బాషల్లోనూ ఆహాను విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తోంది.
Also Read
- Jananayagan : విజయ్ 'జననాయకుడు' ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో
- 2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
- Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
- Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
ఇదిలా ఉంటే బాలీవుడ్ లో బడా బాబులు సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ దిశగా పయనిస్తున్నారు. అందులో భాగంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ కూడా బరిలో దిగడం హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే సినిమాల నిర్మాణంలో శరవేగంగా దూసుకుపోతూ వేలాది కోట్లను కుమ్మరిస్తున్న యష్ రాజ్ ఫిల్మ్స్ దృష్టి ఓటీటీ వ్యాపారంపై పడింది. ఆ సంస్థ అధినేతల్లో ఒకరైన ఆదిత్య చోప్రా డిజిటల్ కంటెంట్ మార్కెట్ ను కబళించాలనే ప్లాన్స్ తో ఉన్నారట. దీనికోసం వందలాది కోట్లు వెచ్చించటానికి రెడీ అవుతున్నాడట. అందులో భాగంగా పలు స్క్రిప్ట్ లతో పాటు, సీరీస్ నిర్మాణానికి సిద్ధం అవుతోంది యశ్ రాజ్. అందులో భాగంగా ఒటిటి ప్లాట్ ఫామ్ లో భారతీయ కథలను ప్రపంచానికి ప్రదర్శించాలనే ఆలోచనతో ఉన్నాడట ఆదిత్య చోప్రా. గత రెండేళ్ళుగా ఆ దిశగా అడుగులు వేస్తోంది యశ్ రాజ్ ఫిలిమ్స్. యశ్ రాజ్ ఫిలిమ్స్ ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టి రంగంలోకి దూకుతుంది. అయితే యశ్ రాజ్ కి ఈ విషయంలో పోటీ ఘనంగా ఉండబోతోంది. ఇప్పటికే ఓటీటీ దిగ్గజాలైన నెట్ ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీహాట్ స్టార్, జీ స్టూడియోతో పాటు సోనీలివ్ వంటి సంస్థలు పాతుకుపోయి ఉన్నాయి. వాటి పోటీని తట్టుకుని తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ ను విజయవంతం చేయాలంటే యశ్ రాజ్ ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మరి యశ్ రాజ్ ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తుందా!? లెట్స్ వెయిట్ అండ్ సీ.
- Tags
- OTT
- Yash Raj
- Yash Raj Films
తాజావార్తలు
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!