యశ్ రాజ్ ఫిలిమ్స్ ఓటీటీ సక్సెస్ సాధిస్తుందా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా పుణ్యమా అని ఇండియాలో ఓటీటీ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ తర్వాత ఇండియా అతి పెద్ద ఓటీటీ మార్కెట్ గా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇండియన్ మార్కెట్ పై ఫోకస్ పెంచాయి. కరోనాతో థియేట్రికల్ రంగం కుదేలయిపోయింది. ఇప్పటికీ పలు ఏరియాల్లో థియేటర్లు ఓపెన్ కాలేదు. ఎంటర్ టైన్ మెంట్ ని ఇష్టపడే భారతీయులు తమ దృష్టిని ఓటీటీవైపు మళ్ళించారు. పలు అంతర్జాతీయ డిజిటల్ సంస్థలతో పాటు జాతీయంగానూ ఎన్నో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పుట్టుకు వచ్చాయి. కరోనా కనుమరుగై థియేట్రికల్ రంగంపై ఆశ చిగురిస్తున్నా… ఓటీటీ రంగంపై ఆసక్తి ఏమాత్రం తగ్గకపోగా రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో బడా కార్పోరేట్ సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల దృష్టి ఇప్పుడు సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రూపకల్పనపై పడింది.
టాలీవుడ్ విషయానికి వస్తే ట్రెండ్ కి అనుగుణంగా అడుగులు వేసే అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాను ఆరంభించి విజయం సాధించారు. ఆరంభంలో ఆటుపోటులు ఎదుర్కొన్నా అదరక బెదరక దాని అభివృద్ధి కోసం అహోరాత్రులు శ్రమించారు. టాలీవుడ్ లో సక్సెస్ సాధించిన అరవింద్ ఇతర దక్షిణాది బాషల్లోనూ ఆహాను విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తోంది.
Also Read
- Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
ఇదిలా ఉంటే బాలీవుడ్ లో బడా బాబులు సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ దిశగా పయనిస్తున్నారు. అందులో భాగంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ కూడా బరిలో దిగడం హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే సినిమాల నిర్మాణంలో శరవేగంగా దూసుకుపోతూ వేలాది కోట్లను కుమ్మరిస్తున్న యష్ రాజ్ ఫిల్మ్స్ దృష్టి ఓటీటీ వ్యాపారంపై పడింది. ఆ సంస్థ అధినేతల్లో ఒకరైన ఆదిత్య చోప్రా డిజిటల్ కంటెంట్ మార్కెట్ ను కబళించాలనే ప్లాన్స్ తో ఉన్నారట. దీనికోసం వందలాది కోట్లు వెచ్చించటానికి రెడీ అవుతున్నాడట. అందులో భాగంగా పలు స్క్రిప్ట్ లతో పాటు, సీరీస్ నిర్మాణానికి సిద్ధం అవుతోంది యశ్ రాజ్. అందులో భాగంగా ఒటిటి ప్లాట్ ఫామ్ లో భారతీయ కథలను ప్రపంచానికి ప్రదర్శించాలనే ఆలోచనతో ఉన్నాడట ఆదిత్య చోప్రా. గత రెండేళ్ళుగా ఆ దిశగా అడుగులు వేస్తోంది యశ్ రాజ్ ఫిలిమ్స్. యశ్ రాజ్ ఫిలిమ్స్ ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టి రంగంలోకి దూకుతుంది. అయితే యశ్ రాజ్ కి ఈ విషయంలో పోటీ ఘనంగా ఉండబోతోంది. ఇప్పటికే ఓటీటీ దిగ్గజాలైన నెట్ ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీహాట్ స్టార్, జీ స్టూడియోతో పాటు సోనీలివ్ వంటి సంస్థలు పాతుకుపోయి ఉన్నాయి. వాటి పోటీని తట్టుకుని తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ ను విజయవంతం చేయాలంటే యశ్ రాజ్ ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మరి యశ్ రాజ్ ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తుందా!? లెట్స్ వెయిట్ అండ్ సీ.
- Tags
- OTT
- Yash Raj
- Yash Raj Films
తాజావార్తలు
-
Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
-
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!