మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా చేస్తున్న సినిమా గుంటూరు కారం.. ఈ సినిమా పై ఎవరూ కూడా ఊహించని రీతిలో కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.సినిమా షూటింగ్ మొదలై ఎన్నో రోజులు అయిన తర్వాత టెక్నీషియన్స్ మరియు నటీనటుల విషయంలో అనూహ్యమైన గాసిప్స్ వస్తున్నాయి. ముందుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను తీసేసారు అని మహేష్ బాబు కు థమన్ ట్యూన్స్ అస్సలు నచ్చలేదు అని వార్తలు వచ్చాయి
ఆ తరువాత ఈ సినిమా నుంచి పూజా హెగ్డేని కూడా తీసేసినట్టు వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలపై థమన్ కూడా కొద్దిగా గట్టిగానే బదులిచ్చారు. మీలో ఎవరికైనా కాలితే తమ ఇంటి దగ్గర మజ్జిగ అందిస్తున్నాము తాగొచ్చు అంటూ సెటైర్ కూడా వేశారు. ఈ విషయం పై చిత్ర యూనిట్ సభ్యులనుంచి కూడా క్లారిటీ వచ్చింది.ఈ చిత్రానికి థమన్ వర్క్ చేస్తున్నాడని ఆయన ఎప్పటిలానే మ్యూజిక్ రెడీ చేస్తున్నట్లు అయితే వారు చెప్పుకొచ్చారు.కానీ హీరోయిన్ విషయం లో మాత్రం క్లారిటీ ఇంకా రాలేదు . పూజా కానీ చిత్ర బృందం కానీ ఎవ్వరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ సినిమా పై తాజాగా రూమర్ ఏమిటంటే పూజా హెగ్డే స్థానంలో సంయుక్త మీనన్ ను తీసుకోవాలని త్రివిక్రమ్ చూస్తున్నట్లు సమాచారం. ఈ మధ్య త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ వరుస ట్వీట్లు చేస్తున్నారు.నిర్మాత బండ్ల గణేశ్ మరో ట్వీట్ ను కూడా చేశారు. సినిమా ఉందా అది కూడా ఎక్కించేశావా అంటూ ఇన్ డైరెక్ట్ గా త్రివిక్రంపై సెటైర్ ను వేశాడు. అయితే గుంటూరు కారం సినిమా చుట్టూ రూమర్స్ పుట్టుకొస్తుండడం తో ఫ్యాన్స్ కూడా కంగారు పడుతున్నారు. ఈ విషయంలో మూవీ టీం స్పష్టత ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.
