నర్తనం… అభినయం… వైజయంతీమాల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరిని చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంతటి అందం సొంతం చేసుకున్నవారిలో కళలు నెలకొని ఉంటే మరింతగా చూసి మురిసిపోతాము. ఆ కళల్లోనూ కరగని వైభవం ఉందంటే, అభిమానంతో కరిగిపోతూ, ఆ కళల నిలయాన్ని ఆరాధిస్తూ ఉంటాము. రాతి గుండెల్లో సైతం కళాభిరుచి కలిగించగల నిపుణులు కొందరు ఉంటారు. అలాంటి వారిలో సుప్రసిద్ధ నటి, నర్తకి వైజయంతీమాల అగ్రస్థానంలో నిలుచుంటారు.
ఓ నాటి తమిళ అందాలతార వసుంధరాదేవి కుమార్తె వైజయంతీ మాల. 1943లో రంజన్ హీరోగా రూపొందిన ‘మంగమ్మ శపథం’లో మంగమ్మగా నటించి అలరించారు వసుంధరాదేవి. తరువాత ఆమె ఎమ్.డి.రామన్ ను వివాహం చేసుకున్నారు. వారి కూతురు వైజయంతీమాలకు సైతం బాల్యంలోనే కళల పట్ల ఎంతో అభిమానం ఉండేది. కన్నవారు ఆమెను నాట్యంలో రాణించాలని ప్రోత్సహించారు. పిన్నవయసులోనే ప్రదర్శన ఇచ్చి పరవశింప చేశారు. 13 ఏళ్ళ వయసులోనే వైజయంతీ మాల నటనారంగంలో అడుగు పెట్టారు. ‘వాళ్కై’ తమిళ చిత్రంతో తెరంగేట్రం చేసిన వైజయంతీమాల, వెంటనే తెలుగు సినిమా ‘జీవితం’లోనూ నటించారు. ఆ పై హిందీ చిత్రం ‘బహార్’లోనూ మురిపించారు. ఒకే కథ, ఒకే పాత్ర మూడు భాషల్లోనూ వరుసగా వైవిధ్యం ప్రదర్శిస్తూ వైజయంతి నటించారు దాంతో అన్ని భాషలవారినీ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. తరువాత యన్టీఆర్ ‘సంఘం’లోనూ కీలక పాత్ర పోషించి మురిపించారు. అనేక తమిళ చిత్రాలలో నటిస్తూనే మరోవైపు హిందీ సినిమాల్లో నటించే అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు వైజయంతీమాల. ప్రదీప్ కుమార్ తో ఆమె నటించిన ‘నాగిన్’ అనూహ్య విజయం సాధించింది. దిలీప్ కుమార్ ‘దేవదాస్’లో చంద్రముఖిగా నటించి మరపురాని అభినయం ప్రదర్శించారు. ఈ నాటికీ చంద్రముఖి అంటే వైజయంతీమాల అనే తీరున నిలచిపోయారు. తరువాత “న్యూ ఢిల్లీ, నయా దౌర్, ఆశా, సాధనా, మధుమతి” చిత్రాలలో వైజయంతీమాల అభినయంతో పాటు నృత్యం కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజ్ కపూర్ ‘సంగం’లో వైజయంతీమాల అందం, ఆ నాటి రసికులకు బంధాలు వేసింది. చారిత్రక చిత్రం ‘ఆమ్రపాలి’లో వైజయంతి నటనను ఎవరూ మరచిపోలేరు. 1968లో వైజయంతీమాలకు పద్మశ్రీ పురస్కారం లభించింది. 1970లో రాజేంద్రకుమార్ హీరోగా రూపొందిన ‘గాన్వార్’ వైజయంతీమాల నటించిన చివరి చిత్రం.
Also Read
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
సినిమాలకు గుడ్ బై చెప్పిన తరువాత వైజయంతీమాల నర్తకిగా తనదైన బాణీ పలికిస్తూ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. భరతనాట్యంకు మరింత ప్రాచుర్యం సంపాదించి పెడుతూ ఆమె ప్రదర్శనలు సాగాయి. వైజయంతీమాల నాట్యం తిలకించిన ఎందరో తమ పిల్లలను నాట్యకళాకారులుగా మార్చడానికి పూనుకున్నారు. 1984లో ఎన్నికలలో సౌత్ చెన్నై పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీచేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1989లో మరోమారు లోక్ సభకు పోటీచేసి విజయం సాధించారు వైజయంతి. 1993లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆరేళ్ళు ఆ పదవిలో కొనసాగిన వైజయంతీమాల 1999లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. ఇప్పటి దాకా అదే పార్టీలో కొనసాగుతున్నారు. 85 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వైజయంతీమాల మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..