మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగా నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 29 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి మా ఎన్నికలు హాట్ హాట్ గా రాజకీయ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
ఇప్పటికే విందులు ఇచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టగా.. తాజాగా ఓటుకు నోటు అనే టాపిక్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓటుకు భారీగానే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తోంది. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ కు తగ్గట్టుగానే, మంచు ప్యానల్ కూడా ఎక్కడ తగ్గకుండా దూసుకుపోతోంది. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వారు వదులుకోవట్లేదనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఈసారి మా ఎన్నికలు అంతా సాధారణంగా ఏమి జరుగవు అని సినీ విశ్లేషకులు చెపుతున్న మాట.
అయితే ఇండస్ట్రీలో చాలా వరకు డబ్బు, పరపతి వున్నా వల్లే కాగా, ఓ వర్గానికి మాత్రం విపరీతమైన డబ్బు పంపిణి జరుగుతుందట. హైదరాబాద్ నగరంలో లేని ఆర్టిస్టులను కూడా కాంటాక్ట్ అవుతున్నారని తెలుస్తోంది. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడమే కాకుండా, ఎన్నికల సమయానికి అందుబాటులో ఉండటానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారట. దీంతో అక్టోబర్ 10న వచ్చే ఫలితాలు వన్ సైడ్ గానే వస్తాయనడానికి అవకాశం లేదనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.