Virupaksha Team again working for a project without sai dharam tej: ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలలో విరూపాక్ష సినిమా కూడా ఒకటి. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సుకుమార్ డైలాగ్స్ అందించడం గమనార్హం. నిజానికి ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ మళ్లీ రైట్ ట్రాక్ లోకి వచ్చి సినిమాలు చేయడం మొదలుపెట్టాడని మెగా అభిమానులందరికీ ఒక భరోసా దొరికింది. అయితే తాజాగా విరూపాక్ష నిర్మాతలు విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. సినిమా టైటిల్ అనౌన్స్ చేయలేదు కానీ బివిఎస్ఎన్ ప్రసాద్ తో పాటు సుకుమార్ కూడా కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నారని అధికారికంగా ప్రకటించారు.
Sanjay Dutt: బిగ్ బ్రేకింగ్.. సెట్ లో సంజయ్ దత్ కు ప్రమాదం.. తలకు కుట్లు
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు నటీనటులు ఎవరు అనే విషయం మీద ఈ సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ ని పక్కన పెట్టి మరో యంగ్ హీరోని సినిమాలో నటింప చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతున్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఒక గుహ లాంటి ప్రదేశంలోకి అత్యాధునిక తాళ్ల సహాయంతో ముగ్గురు వ్యక్తులు లోపలికి దిగుతున్న పిక్ కనిపిస్తోంది. మొత్తానికి సాయి ధరంతేజ్ కాకుండా వేరే హీరో ఫైనల్ అయిన వెంటనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. విరూపాక్షతో హిట్టు వచ్చినా ఎందుకు సాయి ధరమ్ తేజ్ ను పక్కన పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారని విషయం మీద మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు.