Vijayasai Reddy: ఫిలిం స్టార్స్ ఆకాశం నుంచి ఊడి పడలేదు.. చిరు వ్యాఖ్యలకి సాయి రెడ్డి మార్క్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy Counter to Megastar Chiranjeevi: తాజాగా జరిగిన వాల్తేరు వీరయ్య 200 రోజుల విజయోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే పూర్తి వీడియో రిలీజ్ కాకపోవడంతో ప్రభుత్వాలు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమల టార్గెట్ చేయకూడదని అర్థం వచ్చేలా కామెంట్లు చేసినట్టు వీడియో వైరల్ అయింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు ఉన్నాయని భావించి ప్రభుత్వం తరఫున మంత్రులు అధికార పార్టీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున మెగాస్టార్ చిరంజీవి మీద విరుచుకుపడ్డారు. అయితే అసలు మెగాస్టార్ చిరంజీవి టార్గెట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదని అర్థం వచ్చేలా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన పూర్తి వీడియోని తాజాగా సినిమా యూనిట్ రిలీజ్ చేసింది.
సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల…
Also Read
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
- Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 10, 2023
నిజానికి ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకున్నా ఏపీ అధికర పార్టీ కీలక నేత అయిన విజయసాయి రెడ్డి రాజ్యసభలో సినిమాటోగ్రఫీ బిల్లు చర్చ జరిగినప్పుడు చేసిన సూచనల గురించి చిరంజీవి మాట్లాడారు. ఏ హీరో ఎంత తీసుకుంటున్నారు అనే విషయం గురించి కూడా పెద్దల సభలో మాట్లాడాల్సిన అవసరం లేదని సినిమా వాళ్లు చాలా చిన్న వాళ్ళని చెబుతూ మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. ‘’సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ, సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని పేర్కొన్న సాయి రెడ్డి వాళ్ళూ మనుషులే, వారి గురించి మీకెందుకు? వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదని అన్నారు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది.’’ అని అంటూ పరోక్షంగా ఆయన కౌంటర్ వేశారు. అలాగే కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారని అన్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్ అని అన్నారు.
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!