NTV Telugu Site icon

RRR: సీక్వెల్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్

vijayendra prasad

vijayendra prasad

బాహుబలి చిత్రంతో టాలీవుడ్ ను పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టిన డైరెక్టర్ రాజమౌళి. ఇక  బాహుబలి పార్ట్ 1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో ఎండ్ చేసి బాహుబలి 2 కోసం ఎంతగానో ఎదురుచూసేలా చేసిన క్రెడిట్ రాజమౌళికి ఎంత ఉందో, అయన తండ్రి, రైటర్ విజేయద్రప్రసాద్ కు కూడా అంతే ఉంది. ఫాంటసీ, చరిత్ర కథలను రాయడంలో విజయేంద్ర ప్రసాద్ దిట్ట. ఇక ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ కథ కూడా ఆయన కలం నుంచి జారువారిందే. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను ఉహించుకొని వారి పోరాట ప్రతిభను తట్టిలేపి.. ఒక అద్భుతానికి ఆజ్యం పోశారు . ఇక ఎప్పుడూ  చూడలేని ఒక స్టార్ కాంబోను తెరపై అభిమానులు చూసేలా చేశారు. అయితే తాజాగా మరో అద్భుతానికి విజయేంద్ర ప్రసాద్ తెరలేపనున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ ప్రకటించి అభిమానులకు తీపి కబురు చెప్పారు. గతరాత్రి దిల్ రాజు ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూలో “ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్ జరుగుతున్న సమయంలో  ఎన్టీఆర్‌ మతాల మధ్యలో  ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌ గురించి అడిగాడని, నేను కొన్ని ఐడియాలను చెప్పాను. అవి ఎన్టీఆర్‌, రాజమౌళికి బాగా నచ్చాయి. దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో సీక్వెల్‌ రావొచ్చు” అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ వేడుకలో సీక్వెల్ ఉండనున్నదని, త్వరలోనే కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బాహుబలి లానే ఈ సినిమా కూడా ఫ్రాంచైజీగా ఉండనున్నదని తెలిపారు. ఇక ఈ వార్త తెలియడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో  చూడాలి.