ఆ విషయంలో విజయ్ దేవరకొండ తోపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం పుట్టిన ఊరు గురించి, మన సంస్కృతి, సంప్రదాయల గురించి ఏ స్థాయికి చేరుకున్నా పట్టించుకోవాలి. అలాంటి పని స్టార్స్ చేసినప్పుడు ఆ ప్రాంతానికి, ఆ సంస్కృతికి మరింత విలువ పెరుగుతుంది. ఈ విషయంలో విజయ్ దేవరకొండ తోపు అనే చెప్పాలి. ఆ మధ్య నల్లమల అడవుల్లో యురేనియం కోసం త్రవ్వకాలు జరుపబోతున్నారని తెలిసి తన నిరసన గళం విప్పిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా కల్పించడం కోసం కృషి చేస్తున్నాడు. ‘కాకతీయ రాజవంశం నిర్మించిన 800 సంవత్సరాల పురాతన రామప్ప ఆలయం ఇప్పుడు ప్రపంచ వారసత్వ హోదా కోసం పందెంలో ఉంది’ అంటూ విజయ్ దేవరకొండ తన అభిమానులను, నెటిజన్లను ఉత్తేజ పరిచాడు.
read also : చివరి షెడ్యూల్ లో ‘అఖండ’
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఈ విషయంలో చాలా కృషి చేస్తోంది. ప్రపంచ వారసత్వ కమిటీకి భారతదేశం నుండి రామప్ప దేవాలయంను నామినేట్ చేశారని, ఈ నెల 24 నుండి 26 మధ్య దానిని బలపరుస్తూ ఓటు వేయమని ఈ సంస్థ కోరుతోంది. రాష్ట్రమంత్రి కేటిఆర్ తో పాటు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి మీనాక్షి లేఖిని, యునెస్కోనూ ట్యాగ్ చేస్తూ ఈ సంస్థ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీన్ని విజయ్ దేవరకొండ రీ ట్వీట్ చేశాడు. చారిత్రాత్మక విషయాలను విజయ్ దేవరకొండ స్వయంగా పట్టించుకోవడమే కాకుండా… తన అభిమానులను పట్టించుకోమని కోరడం విశేషమే. అయితే… విజయ్ దేవరకొండ మనసులోని గొప్ప ఆలోచనలను అభినందిస్తూనే చాలామంది నెటిజన్లు ‘లైగర్’ అప్ డేట్స్ ఇవ్వమంటూ మొత్తుకుంటున్నారు.
Have always been very intrigued by the historic past..
The 800 year old Ramappa Temple built by the Kakatiya dynasty is now in the race for world heritage status! https://t.co/ItwPIoDdXe
— Vijay Deverakonda (@TheDeverakonda) July 10, 2021
తాజావార్తలు
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?