విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెలలో వీరిద్దరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులను మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించారు. అందుకేనేమో, తమను అభిమానించే వారి కోసం అంటూ భారతదేశ వ్యాప్తంగా కొన్ని సెలెక్టెడ్ సిటీస్లో స్వీట్లు పంచారు. అయితే, ఆ స్వీట్లు తమకు అందలేదంటూ ఒక చిన్నారి సోషల్ మీడియాలో రీల్ చేయడంతో అది ముచ్చటగా అనిపించి, విజయ్ దేవరకొండ – రష్మిక దంపతులు ఆ చిన్నారిని కుటుంబంతో సహా పిలిపించి లంచ్ ఏర్పాటు చేశారు. వారితో కాస్త క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు.
ఈ దెబ్బతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాప చేసిన లాంటి వీడియోలే దర్శనమిస్తున్నాయి. మమ్మల్ని కూడా పిలవాలంటూ చిన్నపిల్లల చేత వీడియోలు చేయిస్తున్నారు వారి తల్లిదండ్రులు. ఎవరో ఒకరిని ముచ్చటపడి పిలిచారంటే అర్థం ఉంది కానీ, అందరూ అదే పనిగా ట్రెండ్ లో ఉన్న రీల్స్ చేస్తున్నట్లు చేసుకుంటూ పోతే చూస్తున్న నెటిజన్లకు “మాకేంట్రా ఈ గోల” అనిపిస్తోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో ఇలాంటి కంటెంట్ చేయించే ముందు కాస్త ఆలోచించుకుంటే మంచిది, లేదంటే చూసేవారికి చిరాకు పుట్టక తప్పదు.
