Balasaraswathi: గాన పితామహి బాలసరస్వతి ఇక లేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ సంగీత ప్రపంచానికి అపారమైన సేవలు అందించిన ప్రముఖ గాయని రావు బాలసరస్వతి (97) ఇక లేరు. ఈ రోజు ఉదయం హైదరాబాద్లో ఆమె తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఈ వార్తను అధికారికంగా వెల్లడించారు. 1928లో జన్మించిన బాలసరస్వతి చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. కేవలం ఆరేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించి, అద్భుతమైన స్వరం తో అందరినీ ఆకట్టుకున్నారు. ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమై, తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందారు.
Also Read : Puri Jagannadh: చార్మితో రిలేషన్.. మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పూరి
Also Read
‘సతీ అనసూయ’ చిత్రం తో సినీ సంగీతం లో అడుగుపెట్టిన ఆమె, తెలుగు సినిమా తొలి నేపథ్య గాయని గా గుర్తింపు పొందారు. సంగీత ప్రపంచంలో తన ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న బాలసరస్వతి, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 2,000కి పైగా పాటలు ఆలపించారు. గానం మాత్రమే కాకుండా, పలు సినిమాల్లో నటించి కూడా తన ప్రతిభను చాటుకున్నారు. తన మృదువైన స్వరం, భావోద్వేగంతో నిండిన పాటలు గుర్తుచేసుకుంటూ.. సంగీత ప్రేమికులు, సినీ ప్రముఖులు ఆమె మరణాన్ని స్మరించుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాలసరస్వతి మరణం తెలుగు సంగీత ప్రపంచానికి తిరుగులేని లోటుగా మారింది.
తాజావార్తలు
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
-
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
-
TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..