Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-అట్లీ కాంబోలో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ తన లుక్ ను పూర్తిగా మార్చేసుకుంటున్నాడు. ఇప్పటికే వర్కౌట్స్ మొదలు పెట్టాడు. ఈ మూవీని దాదాపు రూ.800 కోట్లతో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై రోజుకొక రూమర్లు బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ మూవీలో అండర్ వాటర్ సీన్లు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.
Read Also : JVAS : జగదేక వీరుడు-అతిలోక సుందరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
హాలీవుడ్ మూవీల మాదిరిగా ఇందులో కూడా అండర్ వాటర్ సీన్లు భారీగా ఉండబోతున్నాయంట. దీని కోసం భారీగా వీఎఫ్ ఎక్స్ వాడుతున్నట్టు సమాచారం. టాలీవుడ్ లో ఇలాంటి అండర్ వాటర్ సీన్లు చాలా తక్కువగా వచ్చాయి. అవికూడా కొన్ని సెకన్ల వరకే పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం సేమ్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో వీఎఫ్ ఎక్స్ ను వాడేసి సీన్లు పెట్టబోతున్నాడంట అట్లీ. దీనిపై ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదు. అలాంటి సీన్లు పెడితే మాత్రం కచ్చితంగా ఇది టాలీవుడ్ లో ఓ అరుదైన ప్రయోగం చేసిన సినిమా అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలో నటించలేదు. అందుకే దీనిపై రూమర్లు భారీగా వినిపిస్తున్నాయి.
Read Also : Cease Fire Violation: మారని పాకిస్థాన్ బుద్ది.. భారత్పై మళ్లీ దాడులు?