Udhayanidhi Stalin: త్రిష పేరుతో సభలో వివాదం.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: తమిళనాడులో కావేరీ జలాల అంశంపై జరిగిన నిరసన సభ ఇప్పుడు పూర్తిగా వేరే కారణంతో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విమర్శలతో సాగాల్సిన సభలో ప్రముఖ నటి త్రిష పేరు రావడం, ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. నిన్న కావేరీ నీటి వివాదంపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగించారు. సభలో ఆయన ప్రసంగిస్తూ.. కావేరి నీటి సమస్యపై మన సీఎం విజయ్ నోరు విప్పడం లేదు, ఆయనకు కేవలం DMKపై తప్పుడు కేసులు పెట్టడమే ముఖ్యం అని విమర్శిస్తుండగా, సభలోని కొందరు ‘త్రిష, త్రిష’ అని గట్టిగా అరిచారు. దానికి ఉదయనిధి నవ్వుతూ ‘ఏ నీళ్లు వచ్చినా రాకపోయినా, ఆ నీళ్లు మాత్రం రావాలి’ అని డబుల్ మీనింగ్ వచ్చేలా వ్యాఖ్యానించారు. ఆ వెంటనే కాసేపు ఆగి, మళ్లీ నవ్వుతూ నేను అన్నది కావేరి నీళ్ల గురించని కవర్ చేసే ప్రయత్నం చేశారు.
ఆతర్వాత ఉదయనిధి స్టాలిన్ చిరునవ్వుతో స్పందిస్తూ చేసిన వ్యాఖ్య డబుల్ మీనింగ్ వచ్చేలా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ సభలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా నటి త్రిష పేరును ఈ తరహాలో ప్రస్తావించడం మహిళల పట్ల అవమానకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి సోషల్ మీడియా వేదికగా ఉదయనిధిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలను అసహ్యకరమైనవి, అశ్లీలమైనవి, సిగ్గుచేటైనవిగా అభివర్ణించారు. కుటుంబ విలువలు తెలిసిన ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా బీజేపీ డిమాండ్ చేసింది. ఉదయనిధి స్టాలిన్ను అరెస్టు చేసి చట్టపరంగా విచారించాలని నారాయణన్ తిరుపతి పేర్కొన్నారు.
Also Read
- Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
- Scene: పోలీస్ ఆఫీసర్గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో 'సీన్' ఎలా ఉండబోతోందంటే?
- The Paradise: 'ది ప్యారడైజ్' ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో వాడి వేడి చర్చకు తెరతీసింది. ఒకవైపు డీఎంకే నుంచి అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తుండగా, మరోవైపు సోషల్ మీడియాలో ఉదయనిధి వ్యాఖ్యలపై అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ సభల్లో ఉపయోగించే భాష, ప్రజా ప్రతినిధుల బాధ్యత, మహిళల పట్ల గౌరవం వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత రాజకీయ వేడిని పెంచే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
-
Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!