Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ స్థల వివాదంలో ట్విస్ట్..
- జూనియర్ ఎన్టీఆర్ స్థల వివాదంలో ట్విస్ట్
- హై కోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్ ఇంటి రిజిస్టర్ GPA హక్కుదారు కిలారు రాజేశ్వర రావు
- జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ఇంటితో సంబంధం లేదు: కిలారు రాజేశ్వర రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twist in Jr NTR Land Issue: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదం హైకోర్టుకు చేరుకున్నట్టు కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్ వేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆయన సుంకు గీత నుంచి 2003లో ఈ స్థలాన్ని కొనుగోలు చేయగా తనకు అమ్మిన వ్యక్తులు 1996లోనే తనఖా పెట్టి రుణం పొందాయంటూ పలు బ్యాంకులు రికవరీ ట్రైబ్యునల్ను ఆశ్రయించాయని తెలిపారు. ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పిచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫిర్యాదు చేయండంతో భూమిని విక్రయించిన సుంకు గీతపై కేసు నమోదైందని అన్నారు. అయితే బ్యాంకులకు హక్కులు ఉంటాయని DRT ఇచ్చిన తీర్పుపై హై కోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఇంటి రిజిస్టర్ GPA హక్కుదారు కిలారు రాజేశ్వర రావు ఆశ్రయించారు. బ్యాంకులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ కోర్టును రాజేశ్వర రావు కోరగా DRT ఉత్తర్వులను పక్కకు పెట్టాలని కోర్టు సూచించినట్టు తెలుస్తోంది.
Actor Darshan case: రేణుకా స్వామిని చంపేందుకు 17 మంది కుట్ర.. దర్శన్ కేసులో సంచలన విషయాలు..
Also Read
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
రికవరీ అధికారి ఇరు పార్టీలను విచారించి చట్టానికి అనుగుణంగా త్వరితగతిన క్లెయిమ్ పిటిషన్ పరిష్కరించాలని కోర్టు సూచించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ఇంటితో సంబంధం లేదని కిలారు రాజేశ్వర రావు పేర్కొన్నారు. 2012 లో రిజిస్టర్ GPA చేసుకొని, 2013లో ఇంటిని నా పేరుతో రిజిస్త్రేషన్ చేసుకొన్నానని, ఈ వ్యవహారంలో గతంలోనే సీసీఎస్ లో కేసు నమోదు చేశానని అన్నారు. సుంకు ఆటో లిమిటెడ్ చైర్మన్ సుంకు విష్ణు చరణ్ తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారని అన్నారు. నకిలీ పత్రాలతో బ్యాంకులను మోసం చేశారని తేల్చిన ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు స్థలాన్ని గీతా సంతోష్ విక్రయించారు. గీతా సంతోష్ సంతకాల తో పాటు ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఆమె మరిది విష్ణు చరణ్ మోసానికి పాల్పడినట్టు చెబుతున్నారు. ఇక ఇదే అంశం మీద జూనియర్ ఎన్టీఆర్ టీం కూడా అప్పట్లో స్పందించింది. ఆ ప్రాపర్టీని 2013 లోనే ఎన్టీఆర్ అమ్మేసారు, ఇప్పుడు దానికి, ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఎన్టీఆర్ పేరును ఉపయోగించవద్దు” అని ట్విట్టర్ వేదికగా టీం ప్రకటించింది.
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!