ఘంటసాల శతజయంతి అంతర్జాతీయ ఉత్సవాలలో భాగంగా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారు ఆదివారం ఉదయం అలనాటి నటి కృష్ణవేణిని ఘనంగా సన్మానించారు. అంతే కాదు ఘంటసాల శతజయంతి స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా శ్రీమతి కృష్ణవేణి నిర్మించిన ‘మనదేశం’, ‘కీలుగుర్రం’ చిత్రాలలో కృష్ణవేణి పాడిన పాటలను పాడి వినిపించటం విశేషం. ఈ కార్యక్రమంలో నటుడు, రచయిత తణికెళ్ల భరణి కూడా పాల్గొన్నారు.