తమిళ స్టార్ దర్శకుడు శంకర్ నిర్మాతగా అరివళగన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన చిత్రం ఈరం. టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి హీరోగా సింధు మీనన్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. తెలుగులో ఈ సినిమాను వైశాలి పేరుతో డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేయగా సూపర్ హిట్ గా నిలిచింది. ఒక ఆత్మ తన చావుకు కారణమైన వారిపై నీటి రూపంలో రివెంజ్ తీర్చుకోవడం అనే కథాంశంతో తెరకెక్కిన విశాలి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Also Read : Thandel : అక్కినేని ఫ్యాన్స్ ని భయపెడుతున్న ఆ ఒక్కటి
కాగా ఇప్పుడు ఆ సూపర్ హిట్ వైశాలి కి సీక్వెల్ ను తీసుకువస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగా దర్శకుడు అరివళగన్ తెరకెక్కించిన ఈ సీక్వెల్ ను ‘శబ్దం’ అనే పేరుతో వస్తున్న ఈ సినిమాలో లక్ష్మీ మేనన్ కథానాయికగా నటిస్తోంది. 7జీ ఫిలింస్ పతాకంపై శివ నిర్మించిన ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నారు. ‘వైశాలి’ స్టోరీ నీటితో ముడిపెడుతూ తెరకెక్కించిన దర్శకుడు సీక్వెల్ లో శబ్దం కీలక పాత్ర పోషిస్తుందని మేకర్స్ వెల్లడించారు. వైశాలి మాదిరి ఈ సినిమా కూడా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్.సినిమాస్ విడుదల చేస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. నిశ్శబ్దంగా థియేటర్స్ లోకి వస్తున్న శబ్దం ఏ మేరకు సౌండ్ చేస్తుందో చూడాలి