NTV Telugu Site icon

The Kerala Story: హమ్మయ్య.. ఎట్టేకలకు వివాదాస్పద సినిమా ఓటిటీకి వచ్చేస్తోంది

Kerala

Kerala

The Kerala Story: ఈ మధ్యకాలంలో ఎంత స్టార్ హీరో సినిమా అయినా.. ఎంత హిట్ అందుకున్న సినిమా అయినా నెల తిరిగేలోపు ఓటిటీలో ప్రత్యేక్షమవుతుంది. కానీ, ఏడాది దాటినా కూడా ది కేరళ స్టోరీ మాత్రం ఓటిటీకి వచ్చిందే లేదు. గతేడాది మే 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సుదీప్తో సేన్ తెరకెక్కించాడు. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ది కేరళ స్టోరీ చిత్రం మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకు ఎన్నో వివాదాలు అలుముకున్నాయి. రిలీజ్ అయ్యాకా సినిమాను బ్యాన్ చేయాలనీ రాజకీయ నేతలు చాలా కష్టపడ్డారు. థియేటర్లకు ప్రేక్షకులను రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.

తమిళనాడు రాష్ట్రం మొత్తం ఈ సినిమా రిలీజ్ అయ్యాకా అట్టుడికిపోయింది. ఇక ఈ సినిమా ఓటిటీ రిలీజ్ కూడా వివాదాలే అడ్డంకులుగా మారాయి. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఎన్నో నెలలుగా ఈ సినిమా ఓటిటీలో ఈ నెల వస్తుంది .. వచ్చే నెల వస్తుంది అని వార్తలు వచ్చాయే కానీ మేకర్స్ మాత్రం అధికారిక డేట్ ను అనౌన్స్ చేసింది లేదు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఓటిటీ డేట్ ఖరారు అయ్యింది. ప్రముఖ ఓటిటీ సంస్థ జీ5.. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 16 నుంచి అన్ని భాషల్లో ది కేరళ స్టోరీ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.