Thandel: ఆరోజు కీలక ఘట్టం షూట్.. అందరూ వచ్చేస్తున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thandel Key Scene to be shot on 11th march: నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తండేల్ అనే సినిమా తెరకెక్కుతోంది. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. గతంలో శ్రీకాకుళం జిల్లా నుంచి గుజరాత్ వెళ్లి అక్కడి నుంచి బోట్లలో పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి పట్టుబడిన కొందరు మత్స్యకారుల నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అలా వెళ్లి పాకిస్తాన్ జైల్లో కొన్నాళ్లపాటు శిక్ష అనుభవించిన వ్యక్తిగా నాగచైతన్య కనిపిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరిలో ఆసక్తి నెలకొంది కానీ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఒక వీడియో సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. పాకిస్తాన్ జైలులో కొన్నాళ్లు జైలు జీవితం గడిపి శ్రీకాకుళం తిరిగి వచ్చిన వ్యక్తిగా నాగచైతన్య కనిపిస్తూ ఉండగా ప్రస్తుతానికి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
RGV: శపథం.. నాలుగు గోడల మధ్య జరిగిన యదార్ధ సంఘటన
Also Read
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ శివారులో ఉన్న బీహెచ్ఈఎల్ లో వేసిన ప్రత్యేకమైన పాకిస్తాన్ జైలు సెట్ లో జరుగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక కీలక సీక్వెన్స్ షూటింగ్ 11వ తేదీన జరుగనుంది. ఒక కీలకమైన ఘట్టాన్ని ఆరోజు షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ రోజు పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చి భారతదేశంలోని ఒక రైల్వే స్టేషన్ లో దిగుతున్న షూట్ చేస్తున్నారని, అది సినిమా మొత్తానికి కీలకమైన ఘట్టంగా చెబుతున్నారు. ఆ రోజు రామచంద్రాపురం రైల్వే స్టేషన్ లో జరిగే షూట్ కి సాయి పల్లవి సహా సినిమాల్లో కీలకమైన పాత్రధారులు అందరూ హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని వీలైనంత రియలిస్టిక్ గా తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!