Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లో పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే అధికారం కైవసం చేసుకున్న నాయకుడిగా ‘విజయ్ దళపతి’ పేరు మారుమ్రోగుతోంది. దీంతో ఆయనకు అటు ప్రత్యక్షంగానూ, ఇటు పరోక్షంగానూ ఎందరో వ్యక్తులు అభినందనలు తెలిపారు. అయితే, ఈ ఆనంద సమయంలో తన కొడుకు, కూతురు నుంచి ఒక్కటంటే ఒక్క చిన్న మెసేజ్ కూడా పబ్లిక్గా రాకపోవడం చర్చకు తెరలేపింది. ఈ మేరకు ‘విజయ్’ కొడుకు ‘జాసన్ సంజయ్’ తన తల్లికి మద్దతుగా నిలిచేందుకే ‘విజయ్’కు సంబంధించి ఒక్క పోస్ట్ కూడా వేయలేదని, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయనని అన్ ఫాలో చేసి పారేశాడని కథనాలు మొదలయ్యాయి.
గతంలో ‘విజయ్’ భార్య ‘సంగీత’ విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కినప్పుడు కూడా ‘తండ్రిని అన్ ఫాలో చేసిన కొడుకు…’ అంటూ సేమ్ ఇలాగే వార్తలు వచ్చాయి. అయితే వాస్తవానికి, ‘జాసన్ సంజయ్’ తన తండ్రిని సోషల్ మీడియాల్లో ఇప్పటివరకు ఫాలో అనేది చేసిందే లేదు. అతను ఫాలో అయ్యే 38 ఖాతాల్లో నటుడు ‘విజయ్ సేతుపతి’ ఉండటం, తండ్రి ‘విజయ్ దళపతి’ లేకపోవడంతో తండ్రిని అన్ ఫాలో చేశాడని అంటున్నారు. అయితే, సోషల్ మీడియా వేదికగా ‘జాసన్’ తన తండ్రికి అభినందనలు తెలపకపోవడం అనేది మాత్రం వాస్తవం.
Also Read
- Imanvi Ismail: ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వికి మరో ఛాన్స్ ఎందుకు రాలేదు?.. 'ఫౌజీ' వెనుక ఇదే కారణమా?
- Mixed Talk Movies : మిక్స్డ్ టాక్తో వందల కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చిన సినిమాలు
- Lenin : రిజనబుల్ ధరకే 'లెనిన్' నైజాం టికెట్ ధరలు
- R Madhavan: అందమైన హీరోయిన్ల మధ్య ఉన్నా భార్యను ఎందుకు మోసం చేయలేదో చెప్పిన స్టార్ యాక్టర్!
పైగా అంగరంగ వైభవంగా జరిగిన ఆ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కూడా విజయ్ కొడుకు, కూతురు గైర్హాజరు కావడం, స్నేహితురాలైన నటి త్రిష మాత్రం హాజరై బాగా హడావిడి చేయడం ఈ అన్ ఫాలో చర్చను మరింత రసవత్తరం చేసింది. దీంతో మదర్స్ డే నాడు ‘విజయ్’ను ఉద్దేశిస్తూ ఓ కొడుకు తన తల్లికి మర్చిపోలేని బహుమతి ఇస్తే… మరో కొడుకు (అంటే ‘జాసన్ సంజయ్’ను ఉద్దేశించి) తన తల్లికి ధైర్యం నింపే సానుభూతి ప్రకటించాడు… అంటూ కథనాలు స్టార్ట్ చేశారు.
‘విజయ్’ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత విషయాలపై ఇటువంటి వార్తలు ఎక్కువయ్యాయి. వాటిలో కొన్ని నిజం ఉంటే, మరికొన్ని ఫేక్ ఎలిగేషన్సే. ఇక ‘విజయ్’ భార్య ‘సంగీత’ నివాస సౌకర్యంతో పాటు భారీగా భరణం కోరుతూ దాఖలు చేసిన విడాకుల పిటిషన్ విచారణను కోర్టు జూన్ 15కు వాయిదా వేసింది. దీంతో ‘సంగీత’, ‘జాసన్ సంజయ్’ లండన్లోనే ఉంటున్నారు. ఇక కూతురు ‘దివ్య శాష’ అయితే ఎప్పటినుంచో లండన్లోనే చదువుకుంటోంది.
తాజావార్తలు
-
YSR 77th Birth Anniversary: మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం’.. వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ వైరల్..
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
-
West Bengal R*ape Case: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ప్రధాన నిందితుడు పోలీసు ఎన్కౌంటర్లో మృతి
-
Imanvi Ismail: ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వికి మరో ఛాన్స్ ఎందుకు రాలేదు?.. ‘ఫౌజీ’ వెనుక ఇదే కారణమా?
ట్రెండింగ్
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!