Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లో పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే అధికారం కైవసం చేసుకున్న నాయకుడిగా ‘విజయ్ దళపతి’ పేరు మారుమ్రోగుతోంది. దీంతో ఆయనకు అటు ప్రత్యక్షంగానూ, ఇటు పరోక్షంగానూ ఎందరో వ్యక్తులు అభినందనలు తెలిపారు. అయితే, ఈ ఆనంద సమయంలో తన కొడుకు, కూతురు నుంచి ఒక్కటంటే ఒక్క చిన్న మెసేజ్ కూడా పబ్లిక్గా రాకపోవడం చర్చకు తెరలేపింది. ఈ మేరకు ‘విజయ్’ కొడుకు ‘జాసన్ సంజయ్’ తన తల్లికి మద్దతుగా నిలిచేందుకే ‘విజయ్’కు సంబంధించి ఒక్క పోస్ట్ కూడా వేయలేదని, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయనని అన్ ఫాలో చేసి పారేశాడని కథనాలు మొదలయ్యాయి.
గతంలో ‘విజయ్’ భార్య ‘సంగీత’ విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కినప్పుడు కూడా ‘తండ్రిని అన్ ఫాలో చేసిన కొడుకు…’ అంటూ సేమ్ ఇలాగే వార్తలు వచ్చాయి. అయితే వాస్తవానికి, ‘జాసన్ సంజయ్’ తన తండ్రిని సోషల్ మీడియాల్లో ఇప్పటివరకు ఫాలో అనేది చేసిందే లేదు. అతను ఫాలో అయ్యే 38 ఖాతాల్లో నటుడు ‘విజయ్ సేతుపతి’ ఉండటం, తండ్రి ‘విజయ్ దళపతి’ లేకపోవడంతో తండ్రిని అన్ ఫాలో చేశాడని అంటున్నారు. అయితే, సోషల్ మీడియా వేదికగా ‘జాసన్’ తన తండ్రికి అభినందనలు తెలపకపోవడం అనేది మాత్రం వాస్తవం.
Also Read
- Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
- Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
- Peddi : 'పెద్ది' ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!
- Yogibabu : సత్య - యోగి బాబు నవ్వుల బాంబ్..'రంగబలి' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
పైగా అంగరంగ వైభవంగా జరిగిన ఆ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కూడా విజయ్ కొడుకు, కూతురు గైర్హాజరు కావడం, స్నేహితురాలైన నటి త్రిష మాత్రం హాజరై బాగా హడావిడి చేయడం ఈ అన్ ఫాలో చర్చను మరింత రసవత్తరం చేసింది. దీంతో మదర్స్ డే నాడు ‘విజయ్’ను ఉద్దేశిస్తూ ఓ కొడుకు తన తల్లికి మర్చిపోలేని బహుమతి ఇస్తే… మరో కొడుకు (అంటే ‘జాసన్ సంజయ్’ను ఉద్దేశించి) తన తల్లికి ధైర్యం నింపే సానుభూతి ప్రకటించాడు… అంటూ కథనాలు స్టార్ట్ చేశారు.
‘విజయ్’ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత విషయాలపై ఇటువంటి వార్తలు ఎక్కువయ్యాయి. వాటిలో కొన్ని నిజం ఉంటే, మరికొన్ని ఫేక్ ఎలిగేషన్సే. ఇక ‘విజయ్’ భార్య ‘సంగీత’ నివాస సౌకర్యంతో పాటు భారీగా భరణం కోరుతూ దాఖలు చేసిన విడాకుల పిటిషన్ విచారణను కోర్టు జూన్ 15కు వాయిదా వేసింది. దీంతో ‘సంగీత’, ‘జాసన్ సంజయ్’ లండన్లోనే ఉంటున్నారు. ఇక కూతురు ‘దివ్య శాష’ అయితే ఎప్పటినుంచో లండన్లోనే చదువుకుంటోంది.
తాజావార్తలు
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
-
Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
-
Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?