ఐపీఎస్ అధికారిని నిరాశ పరిచిన “భీమ్లా నాయక్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ సాంగ్ నిన్న బయటకు వచ్చింది. పవన్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్లో రికార్డు స్థాయిలో లైక్లను నమోదు చేసింది. థమన్ స్వరకల్పన, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పవన్ పాత్ర హీరోయిజాన్ని సాంగ్ ద్వారా మరింత పెంచాయి. “ఇరగదీసే ఈడి ఫైర్ సల్లగుండా.. ఖాకీ డ్రెస్ పక్కనపెడితే వీడే పెద్ద గుండా” అంటూ పాట మొదలు పెట్టిన రామజోగయ్య శాస్త్రి రకరకాల పద ప్రయోగాలు చేశాడు. అయితే ఈ సాంగ్ పై ఓ ఐపీఎస్ అధికారి మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Read Also : మణిరత్నంపై కేసు నమోదు
Also Read
తెలంగాణ సీనియర్ ఐపిఎస్ అధికారి, హైదరాబాద్ ఈస్ట్ జోన్ డిసిపి ఎం రమేష్ ఈ పాటలో పోలీసు శాఖను చిత్రీకరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా రామజోగయ్య శాస్త్రి పాట రాసిన విధానాన్ని విమర్శించారు. దానికి కారణం ఆయన పోలీసులు అంటేనే మనుషులను ఇరగదీసే వారు అన్నట్టు రాయడమే. “తెలంగాణా పోలీసులు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసులు, వారిని కాపాడటానికి మాకు జీతం పొందిన వారి ఎముకలను మేము విరగ్గొట్టం, ఆశ్చర్యకరంగా రామజోగయ్య శాస్త్రికి ఒక పోలీసు ధైర్యాన్ని వివరించడానికి తెలుగులో తగినంత పదాలు దొరకలేదా? పాటలో సేవ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు” అంటూ ప్రశ్నించారు.
Thankfully, @TelanganaCOPs are #PeopleFriendlyPolice . We don’t break the bones of those whom we are paid to protect ! Surprisingly, @ramjowrites couldn’t find enough words in Telugu to describe the valour of a cop. No mention of service in the song. https://t.co/EsQVaW5p2s
— Ramesh Masthipuram IPS (@MRAMESHIPS) September 2, 2021
అయితే ఈ విషయంపై రామజోగయ్య శాస్త్రి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ తనకు ఈ పాటకు సాహిత్యం అందించే అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కు, త్రివిక్రమ్ కు కృతజ్ఞతలు తెలిపారు. “పిలిచి బ్లాక్ బస్టర్ హిట్టు పాట కట్టబెట్టిన ప్రియతములు శ్రీ పవన్ కళ్యాణ్ శ్రీ త్రివిక్రమ్ గార్లకు ధన్యవాదాలు. ముఖ్యంగా మొదటిసారి విన్నప్పుడు ప్రతీ లైన్ కి పవన్ కళ్యాణ్ గారు స్పందించిన విధానం ఎప్పటికీ మరచిపోలేను. ఆ అరగంట సమయం అమూల్యం. తమన్ సృజన విభిన్నం వినూత్నం గంభీరం” అంటూ ట్వీట్ చేశారు.
పవన్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో నటించిన “భీమ్లా నాయక్”కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నాగ వంశీ నిర్మించారు.
తాజావార్తలు
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!