Diljit Dosanjh : హైదరాబాదులో దిల్జిత్ కాన్సర్ట్.. తెలంగాణ సర్కార్ షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోశాంజ్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆయన లైవ్ షోలు, వాటికి సంబంధించి జరుగుతున్న వివాదాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నవంబర్ 15న హైదరాబాద్లో దిల్జిత్ కాన్సర్ట్ జరగనుంది. ఈ మేరకు ఈవెంట్ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు పంపింది. నోటీసుల ప్రకారం పిల్లలను వేదికపైకి తీసుకెళ్లకూడదని కోరారు. WHO మార్గదర్శకాల ప్రకారం లైవ్ షో సమయంలో లౌడ్ మ్యూజిక్ ఉంటుంది, ఫ్లాష్ లైట్లు ఉంటాయి కాబట్టి వారిని స్టేజ్ ఎక్కించవద్దని కోరారు. అలాగే మద్యం, మాదక ద్రవ్యాలు, హింసను ప్రోత్సహించేటువంటి పాటలను వేదికపై పాడకూడదని హెచ్చరించారు. WHO మార్గదర్శకాల ప్రకారం, పెద్దలు 140 dB కంటే ఎక్కువ ధ్వని ఒత్తిడికి గురికాకూడదు. అలాగే పిల్లలు 120 dBకి మించి గురికాకూడదు. లైవ్ షోల సమయంలో వేదికపై ధ్వని స్థాయి 120 dB కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలను వేదికపైకి తీసుకెళ్లకూడదు.
Shyam Sundara Kulkarni: ప్రముఖ లిరిసిస్ట్ మృతి.. ఇండస్ట్రీలో విషాదం
Also Read
- Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
- Karikala First Look: సందీప్ కిషన్ 'కరికాల' ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
- Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
- Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్... ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన 'ఇచ్ఛాధారి నాగిన్'..
అలాగే నోటీసులో, దిల్జిత్ పాత కచేరీలలో మద్యం మరియు మాదకద్రవ్యాలను ప్రోత్సహించే పాటలు పాడిన వీడియోలకు ఆధారాలుగా ఇచ్చి వాటిని రిపీట్ చేయవద్దని హెచ్చరించారు. ఇక ఢిల్లీలోని జవహర్లాల్ స్టేడియంలో జరిగిన దిల్-లుమ్నాటి సంగీత కచేరీలో పాటియాలా పెగ్, పంజ్ తారలా వంటి పాటలు దిల్జిత్ పాడారు. నిజానికి గత కొన్ని నెలలుగా దిల్జిత్ కచేరీకి సంబంధించి తీవ్ర వివాదం నడుస్తోంది. దిల్జిత్ లైవ్ షో అక్టోబర్ 26-27 తేదీల్లో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగింది. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత స్టేడియంలో అపరిశుభ్రత వ్యాపించడం అందరినీ కలిచివేసింది. అక్కడ చెత్త కుప్ప చూసి షాక్ అయ్యారు. మద్యం, వాటర్ బాటిళ్లను అక్కడక్కడ విసిరేశారు. రన్నింగ్ ట్రాక్పై కుళ్లిపోయిన ఆహారం, కుర్చీలు విరిగిపోయి కనిపించాయి. ఇక ఆ చెత్త కారణంగా, ఆటగాళ్ళు తమ ప్రాక్టీస్ను ఆపేయాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!