Site icon NTV Telugu

Suhas : సినిమా తీయడం రాదని అవమానించారు.. సుహాస్ ఎమోషనల్..

Suhas

Suhas

Suhas : ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. రొటీన్ రొట్టకొట్టుడు లవ్ స్టోరీలు కాకుండా డిఫరెంట్ స్టోరీలతో మూవీలు చేస్తున్నాడు. ప్రస్తుతం కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పుకప్పురంబు. జులై 4న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా యాంకర్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో సుహాస్ నటించిన కలర్ ఫొటోకు జాతీయ అవార్డు గురించి టాపిక్ వచ్చింది. ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఎలా అనిపించింది అంటూ సుమ ప్రశ్నించింది. దానికి సుహాస్ షాకింగ్ రివీల్ చేశాడు.

Read Also : Keerthi Suresh : ఇంటర్ లోనే అతన్ని లవ్ చేశా.. కీర్తి సురేష్‌ షాకింగ్ కామెంట్స్

మేం ఆ సినిమా చేస్తున్నప్పుడే చాలా అవమానాలు ఎదురయ్యాయి. షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే వాళ్లు సినిమా చేస్తున్నారంటూ అవమానించారు. కానీ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత వాళ్లే ప్రశంసించారు అని షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు సుహాస్. ప్రస్తుతం రాబోతున్న ఉప్పుకప్పురంబు సినిమాలో సుహాస్ కాటికాపరిగా నటిస్తున్నాడు. ఓ గ్రామంలో నెలకొన్న అరుదైన సమస్యను బేస్ చేసుకుని సినిమా చేసినట్టు సుహాస్ తెలిపాడు. మూవీని 28 రోజుల్లోనే షూట్ చేశామని.. కీర్తి సురేష్ తో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది అంటూ తెలిపాడు సుహాస్.

Read Also : Manchu Vishnu : విష్ణు సొంత బ్యానర్ లో మూవీలు ఆపేస్తాడా..?

Exit mobile version