విశ్వనటుడు కమల హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాల్లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తుండగా క్యామియో రోల్ లో సూర్య కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ చిత్ర రైట్స్ని.. టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది.
అది ఎవరంటే.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సొంత నిర్మాణ సంస్థ అయినా శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రం తెలుగు రైట్స్ ను సొంతం చేసుకోంది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ” టర్మరిక్ మీడియా తో అనుసంధానం ఈనాడుకు ఎంతో ఆనందంగా ఉంది. మీరందరు ఎంతగానో ఎదురుచూస్తున్న విశ్వనటుడు కమల్ సార్ నటించిన విక్రమ్ ను తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో జూన్ 3 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.” అంటూ చెప్పుకొచ్చాడు. టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో ఒకటైన శ్రేష్ట్ మూవీస్ ఒకటి.. ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాలను ఇచ్చిన ఈ బ్యానర్ ఫ్యాన్సీ రేటు పెట్టి విక్రమ్ హక్కులను అందుకున్నది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారట. ఏదిఏమైనా ఇంతపెద్ద సినిమా హక్కులు కొనడంతో నితిన్ బంపర్ ఆఫర్ అందుకున్నట్లే.. మరి ఈ సినిమా నితిన్ కు ఎలాంటి లాభాలను తీసుకొచ్చి పెడుతుందో చూడాలి.
Extremely Glad to b associated with @turmericmediaTM to present the much awaited film of Ulaganayagan @ikamalhaasan sir’s #Vikram in Telugu under our @SreshthMovies banner 🤗
Grand Release on June 3rd 🌟@Dir_Lokesh @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial https://t.co/VoTsXdxPh4
— nithiin (@actor_nithiin) May 19, 2022